BRS Bheemgal | ​ఓట్ల కోసమే కాంగ్రెస్​ కొత్త డ్రామాలు.. మంత్రి సీతక్క పర్యటనపై బీఆర్ఎస్ ధ్వజం

అక్షరటుడే, భీమ్​గల్​: BRS Bheemgal |  మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపారని, ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి సీతక్క (Minister Seethakka) చేత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. భీమ్​గల్​ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, మాజీ ఎంపీపీ మహేష్‌ మాట్లాడారు. BRS Bheemgal | ఎన్నికల కోసమే చీరల పంపిణీ.. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల […]

అక్షరటుడే, భీమ్​గల్​: BRS Bheemgal |  మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్‌ నాయకులు కొత్త డ్రామాలకు తెరలేపారని, ప్రజలను మభ్యపెట్టేందుకే మంత్రి సీతక్క (Minister Seethakka) చేత అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. భీమ్​గల్​ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, మాజీ ఎంపీపీ మహేష్‌ మాట్లాడారు.

BRS Bheemgal | ఎన్నికల కోసమే చీరల పంపిణీ..

గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాగానే పట్టణంలో మహిళలకు చీరలు పంచడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టణ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు.

BRS Bheemgal | ​ప్రశాంత్ రెడ్డి చేసిన పనులే ఆధారం..

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy) గతంలో మంజూరు చేసిన 100 పడకల ఆసుపత్రి, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయలేక కాంగ్రెస్ చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎన్నికల కోసం మంత్రి సీతక్కతో ఆ పనులనే మళ్లీ ప్రారంభిస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. భీమ్​గల్​ గడ్డ ప్రశాంత్ రెడ్డి అడ్డా అని, 12 వార్డుల్లోనూ గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బాల్కొండ కాంగ్రెస్ ఇన్​ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డికి (Mutyala Sunil Reddy) రాజకీయ అవగాహన లేదని, ఆవేశం తప్ప ఆలోచన లేదని విమర్శించారు. జిల్లాలో గంజాయి నిర్మూలన చేశామని చెబుతున్న సునీల్ రెడ్డి.. ఇటీవల పెద్దఎత్తున గంజాయి పట్టుబడిన ఘటనలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...