CM Revanth Reddy | హైదరాబాద్​ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్​ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Government) సహకరించాలని సీఎం రేవంత్​రెడ్డి కోరారు. నగరంలోని హోటల్ ITC కోహినూర్​లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం (CM Revanth) కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్​ (Hyderabad)ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజెంట్‌ చేయబోతున్నట్లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్​ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Government) సహకరించాలని సీఎం రేవంత్​రెడ్డి కోరారు. నగరంలోని హోటల్ ITC కోహినూర్​లో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల ప్రాంతీయ సమావేశంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం (CM Revanth) కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్​ (Hyderabad)ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజెంట్‌ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన సహా అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని చూస్తున్నట్లు వెల్లడించారు. భారత్‌ ఫ్యూచర్‌ అనే ఒక సిటీనే త్వరలో నిర్మించడానికి చర్యలు చేపట్టామన్నారు. తమ ప్రణాళికలు అమలు కావాలంటే కేంద్రం సపోర్ట్ అవసరం అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండాలన్నదే తమ ఆలోచన అని సీఎం అన్నారు.

CM Revanth Reddy | మోదీ బడే భాయ్​

ముఖ్యమంత్రులకు ఉన్న ఇబ్బందులేంటో ప్రధాని మోదీ (Prime Minister Modi)కి కూడా తెలుసని రేవంత్​రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ దేశానికి బడే భాయ్‌ అని చెప్పారు. బడే భాయ్‌గా ప్రధాని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి మద్దతివ్వాలని కోరారు. డిసెంబర్ 9న 2047 విజన్ డాక్యుమెంట్​ను ప్రజెంట్​ చేస్తామన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ పనిచేస్తోందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం, RRR, మెట్రో రైలు విస్తరణకు కేంద్రం అనుమతులివ్వాలని కోరారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో 10వ శాతం తెలంగాణ (Telangana) వాటా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు సీఎం వెల్లడించారు. హైదరాబాద్​ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చే చర్యలు చేపడుతామన్నారు. మూడేళ్లలో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులనే నడుపుతామన్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...