Bheemgal | వంతెనకు మరమ్మతులు చేపట్టాలి

అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | ఇటీవల భారీ వర్షాలకు ధ్వంసమైన భీమ్‌గల్‌ – బడా భీమ్‌గల్‌ మధ్య వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు పార్టీ మండలాధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను (TPCC Chief mahesh kumar Goud) కలిసి వినతిపత్రం అందజేశారు. భారీ వర్షాలకు వంతెన ధ్వంసం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరారు. దీంతో స్పందించిన టీపీసీసీ చీఫ్‌ […]

అక్షరటుడే, భీమ్‌గల్‌: Bheemgal | ఇటీవల భారీ వర్షాలకు ధ్వంసమైన భీమ్‌గల్‌ – బడా భీమ్‌గల్‌ మధ్య వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు.

ఈ మేరకు పార్టీ మండలాధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను (TPCC Chief mahesh kumar Goud) కలిసి వినతిపత్రం అందజేశారు. భారీ వర్షాలకు వంతెన ధ్వంసం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరారు.

దీంతో స్పందించిన టీపీసీసీ చీఫ్‌ వెంటనే రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో (Ministser Komati reddy venkat reddy) ఫోన్‌లో మాట్లాడి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, వాక మహేష్, భూషన్, తదితరులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...