KTR | తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం కాదు : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | తెలంగాణలో కాంగ్రెస్​కు​ బీజేపీ (BJP) ప్రత్యామ్నాయం కాదని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. లోక్‌సభలో బీజేపీ 8 సీట్లు గెలుపొందడం ఆకస్మిక విజయం మాత్రమేనని, అట్టడుగు స్థాయి బలం కాదన్నారు. ఆదిలాబాద్, మెదక్ (Medak) జిల్లాలకు చెందిన కీలక నాయకులతో ఆదివారం కేటీఆర్​ సమావేశం అయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల (Municiapl Elections)పై వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాల (Krishna […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | తెలంగాణలో కాంగ్రెస్​కు​ బీజేపీ (BJP) ప్రత్యామ్నాయం కాదని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. లోక్‌సభలో బీజేపీ 8 సీట్లు గెలుపొందడం ఆకస్మిక విజయం మాత్రమేనని, అట్టడుగు స్థాయి బలం కాదన్నారు.

ఆదిలాబాద్, మెదక్ (Medak) జిల్లాలకు చెందిన కీలక నాయకులతో ఆదివారం కేటీఆర్​ సమావేశం అయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల (Municiapl Elections)పై వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాల (Krishna water) సమస్యలతో సహా తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ రాజీ పడినప్పటికీ బీజేపీ మౌనంగా ఉందని విమర్శించారు. గతంలో లేదా భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీకి నిజమైన పునాది బలం లేదా అట్టడుగు స్థాయి ఉనికి లేదని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నుంచి పంచాయతీ ఎన్నికల వరకు ఓటర్లు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారని చెప్పారు.

KTR | కేసీఆర్​ కనిపిస్తే ధైర్యం

రాష్ట్రంలో కేసీఆర్ (KCR) కనిపిస్తే ధైర్యం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్​కు చెందిన పలువురు నాయకులు బీఆర్​ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్​లో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ 24 నెలల పాలన విఫలం అయిందన్నారు. దీంతో కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్​ తీరుతో రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బులు లేకుండా పరిస్థితులు దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలు తగ్గిపోయాయని, ఉపాధి లేకుండా పోయిందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఆయన విమర్శలు చేశారు. బయట కాంగ్రెస్​లో ఉన్నామని చెబుతున్న వారు, స్పీకర్​ దగ్గర మాత్రం తాము బీఆర్​ఎస్​లో ఉన్నట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...