Municipal Elections | పురపోరుపై కమలం ఫోకస్​.. ఇన్​ఛార్జీలను నియమించిన కొత్త బాస్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Municipal Elections | మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ (BJP) ఫోకస్​ పెట్టింది. పుర పోరులో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్​ తెలంగాణపై దృష్టి సారించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిలకు (Assembly Elections) ముందు బీజేపీ బలంగా కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ డీలా పడిపోగా.. కాంగ్రెస్​ పుంజుకొని అధికారంలోకి వచ్చింది. 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ తర్వాత పార్లమెంట్​ ఎన్నికల్లో సత్తా చాటింది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Municipal Elections | మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ (BJP) ఫోకస్​ పెట్టింది. పుర పోరులో సత్తా చాటాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్​ తెలంగాణపై దృష్టి సారించింది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిలకు (Assembly Elections) ముందు బీజేపీ బలంగా కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ డీలా పడిపోగా.. కాంగ్రెస్​ పుంజుకొని అధికారంలోకి వచ్చింది. 8 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీ తర్వాత పార్లమెంట్​ ఎన్నికల్లో సత్తా చాటింది. 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అనంతరం రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించింది. అయితే కొన్ని రోజులుగా పార్టీ ప్రజల్లోకి వెళ్లడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత నేతల మధ్య సమన్వయం కొరవడిందన్న భావన ఉంది.

Municipal Elections | జూబ్లీహిల్స్​లో ఘోర పరాభవం

ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-Election) బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్​ కోల్పోయారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం కమలం పార్టీ సత్తా చాటలేకపోయింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో పార్టీ అధిష్టానం తెలంగాణ (Telangana)పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్​ నబీన్​ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్​ చేశారు.

Municipal Elections | ఇన్​ఛార్జీల నియామకం

నితిన్​ నబిన్​ మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. సాయంత్రం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షణ కోసం ఇన్​ఛార్జీలను నియమించారు.మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల ఇన్​ఛార్జీగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షేలర్​ను ప్రకటించారు. కో ఇంఛార్జులుగా అశోక్, రేఖా శర్మను నియమించారు. కాగా ఇప్పటికే జిల్లాలకు రాష్ట్ర నాయకులను ఇన్​ఛార్జీలుగా నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు.

Municipal Elections | సమన్వయంతో పని చేస్తారా..

రాష్ట్రంలోని కాషాయ పార్టీలో నేతల మధ్య సమన్వయం కొరవడింది. ఎవరికి వారే యమున తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతోనే పార్టీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతుంది. ఇన్ని రోజులు అధిష్టానం సైతం తెలంగాణపై పెద్దగా ఫోకస్​ చేయలేదు. తాజాగా నూతన అధ్యక్షుడు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దక్షిణాదితో బలోపేతం కోసం చూస్తున్న పార్టీ తెలంగాణ కీలకం కానుంది. అయితే నేతల మధ్య సమన్వయం ఉంటేనే అది సాధ్యం అవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నేతలు సమన్వయంతో పని చేస్తే భారీగా సీట్లు సాధించే అవకాశం ఉంది. పట్టణాల్లో బీజేపీకి ఇప్పటికి బలమైన పట్టు ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...