Navipet | నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి

అక్షరటుడే, నవీపేట్​: Navipet | వరద ఉధృతితో పంటలు కొట్టుకుపోగా.. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బినోలా (Binola) సొసైటీ మాజీ ఛైర్మన్​ మగ్గరి హన్మాండ్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం యంచ​ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవీపేట్​ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో గోదావరి (Godavari) వరద కారణంగా సుమారు 4వేల ఎకరాల్లో పంట మొత్తం మునిగిపోయిందన్నారు. పంట పూర్తిగా కుళ్లిపోయిందని రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. అయితే పంటనష్టం వివరాలను […]

అక్షరటుడే, నవీపేట్​: Navipet | వరద ఉధృతితో పంటలు కొట్టుకుపోగా.. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బినోలా (Binola) సొసైటీ మాజీ ఛైర్మన్​ మగ్గరి హన్మాండ్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సోమవారం యంచ​ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవీపేట్​ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో గోదావరి (Godavari) వరద కారణంగా సుమారు 4వేల ఎకరాల్లో పంట మొత్తం మునిగిపోయిందన్నారు. పంట పూర్తిగా కుళ్లిపోయిందని రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. అయితే పంటనష్టం వివరాలను రెండు వారాల క్రితం కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy), స్థానిక తహశీల్దార్​కు వినతిపత్రాల ద్వారా అందజేశామని వివరించారు.

కానీ కనికరం లేని ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని వాపోయారు. దీంతో విసిగిపోయిన తాము యంచ రహదారిపై మహాధర్నా చేపట్టామని వివరించారు. నష్టపోయిన రైతులకు  వెంటనే ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో జిల్లాలోని రైతులందరినీ ఏకంచేసి పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో తొమ్మిది గ్రామాల రైతులతో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు, పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సరీన్, శ్రీకాంత్, కరుణాకర్, బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ రావు, సంజీవ్, లాలు, ప్రవీణ్, కృష్ణ, పోశెట్టి, అన్ని గ్రామల రైతులు పాల్గొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...