KTR | అందుకే ఇండిగో సమస్య.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | దేశంలో ఇండిగో ఎయిర్​లైన్​ (Indigo Airline) సంక్షోభంతో వందలాది విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. దీనిపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ స్పందించారు. కేంద్రం నూతనంగా తెచ్చిన కార్మిక చట్టాలపై ట్రేడ్‌ యూనియన్స్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేటీఆర్​ పాల్గొన్నారు. అధికార ఒకరిద్దరి చేతిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇండిగో సంక్షోభం నిదర్శనం అన్నారు. ఐదు రోజుల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | దేశంలో ఇండిగో ఎయిర్​లైన్​ (Indigo Airline) సంక్షోభంతో వందలాది విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. దీనిపై తాజాగా మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ స్పందించారు.

కేంద్రం నూతనంగా తెచ్చిన కార్మిక చట్టాలపై ట్రేడ్‌ యూనియన్స్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కేటీఆర్​ పాల్గొన్నారు. అధికార ఒకరిద్దరి చేతిలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇండిగో సంక్షోభం నిదర్శనం అన్నారు. ఐదు రోజుల నుంచి ఎయిర్‌పోర్ట్‌లు అన్ని రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్ల కంటే అధ్వానంగా మారాయని పేర్కొన్నారు. శ్రమ దోపిడి చేయొద్దు, పైలెట్ వారానికి ఇంత సమయం మాత్రమే నడపాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంవత్సరం కింద ఒక రూల్ తెచ్చిందన్నారు.
కేంద్రం నిబంధన తెచ్చిన ఇండిగో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని కేటీఆర్​ విమర్శించారు. దీంతో శుక్రవారం ఒక్క రోజు వెయ్యి విమానాలు రద్దు అయ్యాయని చెప్పారు. ఇండిగో దెబ్బకు కేంద్ర మంత్రిత్వ శాఖ (Union Ministry) పెట్టిన రూల్ ను వాళ్ళే వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఇండిగో వెనక్కి తగ్గలేదన్నారు. కానీ కేంద్రం తన ఆదేశాలను ఉపసంహరించుకుందని చెప్పారు. సంపద మొత్తం ఒకరి చేతుల్లోనే ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు.

KTR | లేబర్​ కోడ్​లపై అవగాహన

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేటీఆర్​ అన్నారు. బిల్లు అమలు చేయొద్దని ఆయన డిమాండ్​ చేశారు. కేంద్రంలో కార్మిక చట్టాలను వ్యతిరేకించిన కాంగ్రెస్
రాష్ట్రంలో ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని కలుపుకొని పోరాటం చేయాలని సూచించారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Mallareddy) మాట్లాడితే.. సినిమా టికెట్ రేట్లు పెంచితే అందులో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తెస్తా అని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారన్నారు. పారిశ్రామిక వాడల భూములను అమ్మితే అందులో కూడా 20 శాతం డబ్బులు పారిశ్రామిక కార్మికులకు ఇవ్వాలనే చట్టం తీసుకు రావాలని డిమాండ్​ చేశారు. కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అండగా ఉంటుందన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...