TGSRTC | బతుకమ్మ, దసరా పండుగల స్పెష‌ల్.. తెలంగాణ RTCకి రూ.110 కోట్ల ఆదాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC | బతుకమ్మ, దసరా పండుగల వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)కి ఈ సంవత్సరం దాదాపు రూ.110 కోట్ల ఆదాయం లభించినట్లు సంస్థ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. ఇది గత ఏడాది వసూలైన ఆదాయంతో పోల్చితే స్వల్పంగా తక్కువే అయినప్పటికీ, సాధించిన ఆదాయం గణనీయమేనని అధికారులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా పండుగల సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు ప్రయాణించడంతో RTC ప్రత్యేక బస్సులను నడిపిస్తూ వస్తోంది. ఈ ఏడాది 7,754 […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC | బతుకమ్మ, దసరా పండుగల వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)కి ఈ సంవత్సరం దాదాపు రూ.110 కోట్ల ఆదాయం లభించినట్లు సంస్థ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.

ఇది గత ఏడాది వసూలైన ఆదాయంతో పోల్చితే స్వల్పంగా తక్కువే అయినప్పటికీ, సాధించిన ఆదాయం గణనీయమేనని అధికారులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా పండుగల సందర్భంగా ప్రజలు పెద్దఎత్తున సొంతూళ్లకు ప్రయాణించడంతో RTC ప్రత్యేక బస్సులను నడిపిస్తూ వస్తోంది. ఈ ఏడాది 7,754 స్పెషల్ బస్సులు (Special Bus) నడిపే ఉద్దేశం ఉన్నప్పటికీ, ప్రజల స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కేవలం 5,300 బస్సులకే పరిమితం అయ్యామని అధికారులు తెలిపారు.

TSRTC | ఇంకా రద్దీ ఉండే అవకాశం..

ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేసినప్పటికీ, ప్రయాణికుల సంఖ్య గత ఏడాదితో పోల్చితే తక్కువగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో 6,300 ప్రత్యేక బస్సులు నడిపి రూ.114 కోట్ల ఆదాయం వసూలైంది. ఈ సంవత్సరం తగ్గుదలకు ప్రధాన కారణంగా ప్రైవేటు వాహనాల వినియోగం పెరగడం అనే విశ్లేషణను ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. బతుకమ్మ (Bathukamma) మరియు దసరా పండుగల (Dussera Festival) అనంతరం తిరుగు ప్రయాణం కోసం కూడా TGSRTC పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 5, 6 తేదీల్లో తిరిగి హైదరాబాద్, ఇతర పట్టణాలకు వచ్చే ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా మరిన్ని స్పెషల్ బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది.

RTC అధికారులు మాట్లాడుతూ, “ప్రయాణికుల సౌకర్యం దృష్టిలో ఉంచుకొని, రద్దీకి అనుగుణంగా బస్సులు నడపడం, నష్టాలు తప్పించుకోవడం రెండింటి మధ్య సమతుల్యత సాధించడం సంస్థకు ప్రధాన ఛాలెంజ్‌గా మారింది,” అని తెలిపారు. ఈ ఏడాది లెక్కల ప్రకారం, వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్టు సమాచారం.

ఇందుకు కార్ల షేరింగ్ యాప్‌లు, ట్యాక్సీలు, ట్రావెల్ ఏజెన్సీలు, ప్రైవేట్ బస్సులు కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులను తీసుకెళ్లడం RTC ఆదాయంపై ప్రభావం చూపించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పండుగల నేపథ్యంలో, RTC ముందుగానే ఆన్లైన్ బుకింగ్స్, అడ్వాన్స్ టికెట్ల ద్వారా రద్దీని అంచనా వేసి, స్పెషల్ బస్సుల సంఖ్యను నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అన‌వ‌స‌రంగా ఖాళీ బస్సులు నడిపి సంస్థపై ఆర్ధిక భారం పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం,” అని వారు చెప్పారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...