PM Modi | కాశ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే ఉగ్ర దాడులు.. ప‌హ‌ల్గామ్ బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని మోదీ హామీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ :PM Modi | అభివృద్ధి బాట ప‌డుతున్న కాశ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే ఉగ్ర‌వాదులు (Terrorists) దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. జ‌మ్మూకాశ్మీర్‌తో పాటు దేశ‌ అభివృద్ధిని శత్రువులు ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్నారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని పున‌రుద్ఘాటించారు. మోదీ ఆదివారం తన మన్ కీ బాత్(Man Ki Baath) రేడియో కార్యక్రమం(Radio Program)లో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ :PM Modi | అభివృద్ధి బాట ప‌డుతున్న కాశ్మీర్‌ను నాశ‌నం చేసేందుకే ఉగ్ర‌వాదులు (Terrorists) దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. జ‌మ్మూకాశ్మీర్‌తో పాటు దేశ‌ అభివృద్ధిని శత్రువులు ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్నారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి బాధితుల‌కు న్యాయం చేస్తామ‌ని పున‌రుద్ఘాటించారు. మోదీ ఆదివారం తన మన్ కీ బాత్(Man Ki Baath) రేడియో కార్యక్రమం(Radio Program)లో మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రస్తావించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22న దాడి చేసిన ఉగ్రవాదులు.. కశ్మీర్‌ను నాశనం చేయాలనుకుంటున్నారన్నారు.

PM Modi | నిరాశ వాదానికి ప్ర‌తిబింబం..

ఉగ్ర‌వాదుల వెనుక ఉన్న వారు పిరికివాళ్ల‌ని, ప‌హ‌ల్గామ్ దాడి వారి నిరాశ‌ను ప్ర‌తిబింబిస్తుంద‌ని మోదీ అన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి(Terrorist attack) సీమారంత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ఇది వారి పిరికితనాన్ని చూపిస్తుంద‌ని తెలిపారు. కశ్మీర్‌లో శాంతి తిరిగి వస్తున్న సమయంలో, పాఠశాలలు, కళాశాలలు ఉత్సాహంగా న‌డుస్తాయ‌న్నారు. ప్రజాస్వామ్యం బలపడుతోంద‌ని, పర్యాటకం పెరుగుతోంద‌ని, యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయని గుర్తు చేశారు. కానీ జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)తో పాటు దేశం అభివృద్ధి చెందడాన్ని శత్రువులు ఇష్టపడడం లేద‌న్నారు. ఉగ్రవాదులు కాశ్మీర్‌ను మరోసారి నాశనం చేయాలనుకుంటున్నార‌ని తెలిపారు.

PM Modi | భార‌తీయుల హృదయం ర‌గిలి పోతోంది..

పహల్గామ్(Pahalgam) ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం జరుగుతుందని నేను మరోసారి హామీ ఇస్తున్నాన‌ని మోదీ తెలిపారు. ఈ దాడి త‌న హృదయంలో తీవ్ర వేదనను మిగిల్చిందని ప్రధాని చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో ప్రతి పౌరుడి హృదయ విదారకమైంది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడు ప్రగాఢ సానుభూతి చెందుతున్నాడ‌ని వివ‌రించారు. ఈ దాడి కారణంగా భారతదేశంలోని ప్రతి పౌరుడు కోపంతో రగిలిపోతున్నాడని తనకు అర్థమవుతుందన్నారు. ఉగ్రవాదం సవాళ్లను ఎదుర్కోవాలనే మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...