అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్లో జీఎంఆర్ ఏరోపార్క్ సెజ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) పాల్గొన్నారు.
జీఎంఆర్ ఏరోపార్క్ (GMR Aeropark)లో సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా LEAP ఇంజిన్ MRO కేంద్రం ప్రారంభోత్సవం M88 MRO కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాఫెల్ విమాన విడి భాగాలు తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేశారు. కొత్త ఎంఆర్వో యూనిట్లో ఎం88 ఇంజిన్లు తయారు చేయనున్నారు. నేవీ, ఎయిర్ఫోర్స్కు ఈ యూనిట్ ఉపయోగపడుతుందని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.
CM Revanth Reddy | వెయ్యి మందికి ఉపాధి
ఇంత ముఖ్యమైన పెట్టుబడి కోసం హైదరాబాద్ (Hyderabad)ను ఎంచుకున్నందుకు సఫ్రాన్ సంస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ (Telangana) ఏరోస్పేస్, రక్షణ రంగంలో ఈ కొత్త సౌకర్యం ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. భారతదేశంలో ఇది మొట్టమొదటి LEAP ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు మరియు ఓవర్హాల్ (MRO) కేంద్రం అని ఆయన తెలిపారు. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంతో 1,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానిక MSMEలు, ప్రెసిషన్ ఇంజనీరింగ్ సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
CM Revanth Reddy | భారీ పెట్టుబడులు
భారత వైమానిక దళం, నావికాదళం రెండింటికీ మద్దతు ఇచ్చే సఫ్రాన్ M88 మిలిటరీ ఇంజిన్ MRO కి ఈరోజు పునాది రాయి వేశామన్నారు. 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు మరియు 1,500 కంటే ఎక్కువ MSMEలకు నిలయంగా హైదరాబాద్ ఒక ప్రధాన ఏరోస్పేస్, రక్షణ కేంద్రంగా మారిందని నొక్కి చెప్పారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, SEZలు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుంచి మెగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయన్నారు. హైదరాబాద్ ఇప్పటికే సఫ్రాన్, బోయింగ్, ఎయిర్బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి కంపెనీలకు తయారీ, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు గమ్యస్థానంగా ఉందన్నారు. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ ఎగుమతులు గత సంవత్సరం రెట్టింపు అయ్యాయని, తొమ్మిది నెలల్లోనే రూ.30,742 కోట్లకు చేరుకున్నాయని వెల్లడించారు.
