Nizamabad Congress | సోనియా చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Congress | సోనియా చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని.. తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉంటారని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి (DCC President Nagesh Reddy) పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్​ కార్యాలయంలో నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదినం నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్​ కట్​చేశారు. అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ (Sonia Gandhi) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నగేష్​ […]

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Congress | సోనియా చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని.. తెలంగాణ ప్రజలు ఆమెకు రుణపడి ఉంటారని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి (DCC President Nagesh Reddy) పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్​ కార్యాలయంలో నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో సోనియాగాంధీ జన్మదినం నిర్వహించారు. ఈ సందర్భంగా కేట్​ కట్​చేశారు. అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ (Sonia Gandhi) చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నగేష్​ రెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న గొప్పవ్యక్తి సోనియాగాంధీ అని పేర్కొన్నారు.

Nizamabad Congress | అధికారం కోసం చూడలేదు..

దేశం కోసం భర్త మృతి చెందినప్పటికీ దుఃఖాన్ని దిగమింగుకుని పార్టీ కోసం నిలబడిన వ్యక్తి సోనియాగాంధీ అని నగేష్​ రెడ్డి పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అధికారంలోకి వచ్చినప్పటికీ ఏనాడు అధికారం కోసం చూడలేదన్నారు. ఎల్లప్పుడూ పార్టీ కోసం కృషి చేస్తున్న సోనియాగాంధీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాబోయే ప్రోగ్రామింగ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధానిగా రాహుల్ గాంధీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, భక్తవత్సలం, జావీద్ అక్రమ్, రత్నాకర్, రామర్తి గోపి, విపుల్ గౌడ్, వేణు రాజ్, రాజా నరేందర్ గౌడ్, సేవాదళ్ సంతోష్, యాదగిరి, ఈసా, మఠం రేవతి, అబ్దుల్ ఎజాజ్, పోల ఉష, చంద్రకళ, లవంగ ప్రమోద్, సకినాల శివ కుమార్, అంతరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, విజయ లక్ష్మి, సుజాత, ఆషాబీ, మాలిక బేగం, రాజేంద్ర ప్రసాద్, నరేందర్ గౌడ్, విజయ రాణి, స్వప్న, మీనా, షకీల్, ముస్తఫా, ఆదె ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...