Hyderabad Police | తెలంగాణ పోలీస్​ వెబ్​సైట్లు హ్యాక్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police | సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు వెబ్​సైట్​ను హ్యాక్​ చేసిన ఈ ముఠా.. తాజాగా పోలీసుల వెబ్​సైట్​లను హ్యాక్​ చేసింది. దీంతో పది రోజులుగా అధికారులు ఆయా వెబ్​సైట్​ సేవలను నిలిపివేశారు. హైదరాబాద్​ నగరంలోని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate) వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. ఏకంగా పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లను బెట్టింగ్​ మాఫియా హ్యాక్ చేసింది. దీంతో పది రోజులుగా వెబ్ సైట్ల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police | సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు వెబ్​సైట్​ను హ్యాక్​ చేసిన ఈ ముఠా.. తాజాగా పోలీసుల వెబ్​సైట్​లను హ్యాక్​ చేసింది. దీంతో పది రోజులుగా అధికారులు ఆయా వెబ్​సైట్​ సేవలను నిలిపివేశారు.

హైదరాబాద్​ నగరంలోని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate) వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. ఏకంగా పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లను బెట్టింగ్​ మాఫియా హ్యాక్ చేసింది. దీంతో పది రోజులుగా వెబ్ సైట్ల సేవలు నిలిచిపోయాయి. కమిషనరేట్ వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్ వెబ్ సైట్లకు రీ-డైరెక్ట్ అయ్యేలా హ్యాకర్లు చేశారు. దీంతో ఐటీ విభాగం రెండు సైట్​ల సర్వర్లను డౌన్​ చేసింది. ప్రస్తుతం ఈ వెబ్​సైట్​ల నిర్వహణను నేషనల్​ ఇన్​ఫర్మేటిక్ సెంటర్​ (National Informatics Center) చూస్తోంది. ఆ సంస్థ అప్రమత్తం అయి సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టింది. హ్యాకింగ్​కు పాల్పడిన ముఠాను పట్టుకోవడానికి సైబర్​ క్రైమ్​ పోలీసులు (Cyber ​​Crime Police) దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Police | ఇటీవల హైకోర్టు వెబ్​సైట్​..

తెలంగాణ హైకోర్టు వెబ్​సైట్​ను (Telangana High Court website) దుండగులు ఇటీవల హ్యాక్​ చేశారు. ఆర్డర్​ కాపీలు డౌన్​లోడ్​ చేస్తుంటే ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ (online betting site) ఓపెన్ అయింది. పీడీఎఫ్​ ఫైల్స్​కు బదులు బీడీజీ స్లాట్​ అనే బెట్టింగ్​ సైట్​ ఓపెన్​ అయినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఈ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్​ క్రైమ్​ పోలీసులు సమస్యను పరిష్కరించారు.

Hyderabad Police | హ్యాకింగ్​తో కలవరం

హ్యాకర్లు ఇటీవల ప్రభుత్వ వెబ్​సైట్​లను హ్యాక్​ చేస్తున్నారు. ప్రజల డేటాను దొంగిలిస్తున్నారు. దీంతో సైబర్​ సెక్యూరిటీ (Cyber ​​Security)పై ఆందోళన నెలకొంది. కీలకమైన ప్రజా భద్రతకు సంబంధించిన సైట్లను సైతం గతంలో కొందరు హ్యాక్​ చేసి డేటా తస్కరించారు. ఇటీవల హైకోర్టు వెబ్​సైట్​ను హ్యాక్​ చేసి బెట్టింగ్​ సైట్​కు రీ డైరెక్ట్​ అయ్యేలా చేశారు. తాజాగా పోలీసులకే షాక్​ ఇస్తూ వెబ్​సైట్​లను హ్యాక్​ చేశారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...