Homeతాజావార్తలుHyderabad Police | తెలంగాణ పోలీస్​ వెబ్​సైట్లు హ్యాక్

Hyderabad Police | తెలంగాణ పోలీస్​ వెబ్​సైట్లు హ్యాక్

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. దీంతో పోలీసులు పది రోజులుగా ఆయా వెబ్​సైట్ల సేవలను నిలిపివేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Police | సైబర్​ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు వెబ్​సైట్​ను హ్యాక్​ చేసిన ఈ ముఠా.. తాజాగా పోలీసుల వెబ్​సైట్​లను హ్యాక్​ చేసింది. దీంతో పది రోజులుగా అధికారులు ఆయా వెబ్​సైట్​ సేవలను నిలిపివేశారు.

హైదరాబాద్​ నగరంలోని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate) వెబ్ సైట్లు హ్యాక్ అయ్యాయి. ఏకంగా పోలీస్ కమిషనరేట్ల వెబ్ సైట్లను బెట్టింగ్​ మాఫియా హ్యాక్ చేసింది. దీంతో పది రోజులుగా వెబ్ సైట్ల సేవలు నిలిచిపోయాయి. కమిషనరేట్ వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్ వెబ్ సైట్లకు రీ-డైరెక్ట్ అయ్యేలా హ్యాకర్లు చేశారు. దీంతో ఐటీ విభాగం రెండు సైట్​ల సర్వర్లను డౌన్​ చేసింది. ప్రస్తుతం ఈ వెబ్​సైట్​ల నిర్వహణను నేషనల్​ ఇన్​ఫర్మేటిక్ సెంటర్​ (National Informatics Center) చూస్తోంది. ఆ సంస్థ అప్రమత్తం అయి సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టింది. హ్యాకింగ్​కు పాల్పడిన ముఠాను పట్టుకోవడానికి సైబర్​ క్రైమ్​ పోలీసులు (Cyber ​​Crime Police) దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad Police | ఇటీవల హైకోర్టు వెబ్​సైట్​..

తెలంగాణ హైకోర్టు వెబ్​సైట్​ను (Telangana High Court website) దుండగులు ఇటీవల హ్యాక్​ చేశారు. ఆర్డర్​ కాపీలు డౌన్​లోడ్​ చేస్తుంటే ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ (online betting site) ఓపెన్ అయింది. పీడీఎఫ్​ ఫైల్స్​కు బదులు బీడీజీ స్లాట్​ అనే బెట్టింగ్​ సైట్​ ఓపెన్​ అయినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఈ ఘటనపై హైకోర్టు రిజిస్ట్రార్ పోలీసులను ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్​ క్రైమ్​ పోలీసులు సమస్యను పరిష్కరించారు.

Hyderabad Police | హ్యాకింగ్​తో కలవరం

హ్యాకర్లు ఇటీవల ప్రభుత్వ వెబ్​సైట్​లను హ్యాక్​ చేస్తున్నారు. ప్రజల డేటాను దొంగిలిస్తున్నారు. దీంతో సైబర్​ సెక్యూరిటీ (Cyber ​​Security)పై ఆందోళన నెలకొంది. కీలకమైన ప్రజా భద్రతకు సంబంధించిన సైట్లను సైతం గతంలో కొందరు హ్యాక్​ చేసి డేటా తస్కరించారు. ఇటీవల హైకోర్టు వెబ్​సైట్​ను హ్యాక్​ చేసి బెట్టింగ్​ సైట్​కు రీ డైరెక్ట్​ అయ్యేలా చేశారు. తాజాగా పోలీసులకే షాక్​ ఇస్తూ వెబ్​సైట్​లను హ్యాక్​ చేశారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Must Read
Related News