Tekmal SI | ఏసీబీకి చిక్కిన టెక్మల్ ఎస్సై.. సంబురాలు చేసుకున్న స్థానికులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tekmal SI | లంచం తీసుకుంటూ ఓ సబ్ ఇన్ స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు దొరికి పోయాడు. ఓ కేసు విషయమై రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. మెదక్ జిల్లా టెక్మల్ పోలీస్​ స్టేషన్​లో (Tekmal Police Station) ఎస్సైగా రాజేశ్ విధులు నిర్వహిస్తున్నాడు. చోరీ కేసు విషయమై స్థానికుడైన ఓ వ్యక్తితో పాటు అతని స్నేహితుడిపైనా కేసు నమోదు కాగా.. లోక్ అదాలత్​లో (Lok […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tekmal SI | లంచం తీసుకుంటూ ఓ సబ్ ఇన్ స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు దొరికి పోయాడు. ఓ కేసు విషయమై రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. మెదక్ జిల్లా టెక్మల్ పోలీస్​ స్టేషన్​లో (Tekmal Police Station) ఎస్సైగా రాజేశ్ విధులు నిర్వహిస్తున్నాడు.

చోరీ కేసు విషయమై స్థానికుడైన ఓ వ్యక్తితో పాటు అతని స్నేహితుడిపైనా కేసు నమోదు కాగా.. లోక్ అదాలత్​లో (Lok Adalat) పరిష్కారమైంది. అయితే, తాజాగా అదే కేసులో పోలీసులు నిందితుడికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద మరోసారి నోటీసులు జారీ చేశారు. లోక్ అదాలత్​లో కొట్టేసిన ఈ కేసును పరిష్కరించేందుకు ఎస్సై నిందితుడి నుంచి రూ.30 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని (ACB) ఆశ్రయించగా, వారు వల పన్నారు. నిందితుడు మంగళవారం పోలీస్​ స్టేషన్​లో ఎస్సై రాజేశ్​కు లంచం ఇస్తుండగా, ఏసీబీ అధికారులు (ACB Officers) అక్కడ ప్రత్యక్షమయ్యారు.

Tekmal SI | పరుగులు పెట్టిన ఎస్సై..

అవినీతి నిరోధకశాఖ అధికారులను చూసి ఎస్సై రాజేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. లంచం తీసుకుంటున్న క్రమంలో తాను దొరికి పోతాననే భయంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమీప పొలాల నుంచి పారిపోతుండగా, ఏసీబీ అధికారులు వెంటపడి పట్టుకున్నారు. ఎస్సై రాజేశ్ ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఎస్సై పట్టుబడిన విషయం తెలిసి స్థానికులు సంబురాలు చేసుకున్నారు. అవినీతి పీడ విరగడ అయిందంటూ పోలీసుస్టేషన్ ఎదుట పటాకులు కాల్చారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...