Bihar | బీహార్​లో ఉపాధ్యాయురాలి హత్య.. న్యాయం కోసం నెటిజన్ల పోరాటం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar | బీహార్​లో ఓ ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురైంది. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున టీచర్లు నిరసన చేపడుతున్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలని కోరుతున్నారు. బీహార్‌లోని అరారియా జిల్లా (Araria District)లో బుధవారం ఉదయం ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బారాబంకి ప్రాంతానికి చెందిన శివానీ కుమారి (28) ఖబ్డా కన్హైలి మిడిల్ స్కూల్‌లో కాంట్రాక్ట్ టీచర్‌గా చేరింది. ఆమె బుధవారం పాఠశాలకు స్కూటీపై వెళ్తుండగా.. బైక్‌పై […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar | బీహార్​లో ఓ ఉపాధ్యాయురాలు దారుణ హత్యకు గురైంది. దీంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున టీచర్లు నిరసన చేపడుతున్నారు. బాధిత యువతికి న్యాయం చేయాలని కోరుతున్నారు. బీహార్‌లోని అరారియా జిల్లా (Araria District)లో బుధవారం ఉదయం ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని బారాబంకి ప్రాంతానికి చెందిన శివానీ కుమారి (28) ఖబ్డా కన్హైలి మిడిల్ స్కూల్‌లో కాంట్రాక్ట్ టీచర్‌గా చేరింది. ఆమె బుధవారం పాఠశాలకు స్కూటీపై వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. దీంతో శివాని అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే టీచర్​ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Bihar | ఇటీవల నిశ్చితార్థం

స్థానికుల ప్రకారం, శివాని కొన్ని నెలల క్రితమే అరారియాలో చేరింది. నర్పత్‌గంజ్‌ (Narpatganj)లో అద్దెకు ఉంటూ జీవిస్తోంది. రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయినట్లు సమాచారం. ఈ క్రమంలో మృతురాలి సోదరి జూలీ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు ఒక సంవత్సరం క్రితం అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రంజిత్ కుమార్ వర్మ తనను వివాహం చేసుకోవాలని శివానిపై ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది. ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరగడంతో ఆయనే హత్య చేయించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

శివాని తండ్రి ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ (Circle Inspector)గా పని చేస్తున్నారు. ఆమె ఇద్దరు సోదరీమణులు బీహార్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. జూలీ వర్మ తన సోదరికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా శివానికి మద్దతుగా సోషల్​ మీడియాలో పెద్ద ఎత్తున పోరాటం సాగుతోంది. జస్టిస్​ ఫర్​ శివాని హ్యాష్​ ట్యాగ్​ ఎక్స్​లో ట్రెండింగ్​లో ఉంది. దీంతో పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...