CM Revanth Reddy | సీఎం రేవంత్​ సభలో టీడీపీ జెండాలు.. రాజకీయ వర్గాల్లో చర్చ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. సీఎం రేవంత్​రెడ్డి సభలో టీడీపీ జెండాలు (TDP flags) తీవ్ర చర్చకు దారి తీశాయి. పాలేరు సభలో పలువురు టీడీపీ జెండాలతో హాజరు అయ్యారు. అంతేగాకుండా సీఎం టీడీపీ గురించి మాట్లాడినప్పుడు సభ ప్రాంగణాన్ని హోరెత్తించారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (Chief Minister Revanth Reddy) ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

సీఎం రేవంత్​రెడ్డి సభలో టీడీపీ జెండాలు (TDP flags) తీవ్ర చర్చకు దారి తీశాయి. పాలేరు సభలో పలువురు టీడీపీ జెండాలతో హాజరు అయ్యారు. అంతేగాకుండా సీఎం టీడీపీ గురించి మాట్లాడినప్పుడు సభ ప్రాంగణాన్ని హోరెత్తించారు. సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో సీనియర్​ ఎన్టీఆర్, చంద్రబాబుకు ​(senior NTR and Chandrababu) అభిమానులు ఉన్నారని తెలిపారు. తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని దెబ్బ తీసిన బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బొంద పెట్టిన రోజే సీనియర్ ఎన్టీఆర్​కి నిజమైన నివాళులు అర్పించినట్లు అన్నారు. ఈ రోజు ఎన్టీఆర్​ వర్ధంతి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ పై కక్ష కట్టిన కేసీఆర్, బీఆర్ఎస్​ని వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలని నందమూరి అభిమానులను, చంద్రబాబు అభిమానులను ఆయన కోరారు.

CM Revanth Reddy | అందుకోసమేనా..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ టీడీపీకి అభిమానులు ఉన్నారు. త్వరలో మున్సిపల్​ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమిగా ఉన్నాయి. దీంతో తెలంగాణలో ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు బీజేపీకి ఓటు వేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీడీపీ మద్దతుదారులను కాంగ్రెస్​ వైపు తిప్పుకోవడానికి తాజాగా సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారే కావడంతో పురపోరులో ఆ పార్టీ మద్దతుదారుల ఓట్ల కోసం తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy | రాజకీయ వర్గాల్లో కీలక చర్చ

రేవంత్​రెడ్డి పాలేరు సభలో టీడీపీ జెండాలు, ఆయన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్​ పార్టీ ఎన్డీఏపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం సభలో ఆ పార్టీ జెండాలు పట్టుకొని హాజరు కావడం గమనార్హం. మరోవైపు బీఆర్​ఎస్​ కొంతకాలంగా చంద్రబాబు శిష్యుడు రేవంత్​రెడ్డి అని ప్రచారం చేస్తోంది. గురుదక్షిణ రేవంత్​ తెలంగాణ నీళ్లను ఇస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో సీఎం టీడీపీకి అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. ఆ వ్యాఖ్యలను బీఆర్​ఎస్​ తనకు అనుకూలంగా మల్చుకునే అవకాశం ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...