ACB Trap | ఏసీబీకి చిక్కిన తహశీల్దార్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలోని తహశీల్దార్​ కార్యాలయాలు (Tahsildar offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. నిత్యం ఏదో ఒక కార్యాలయంలో లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీ(ACB)కి చిక్కుతున్నారు. అన్ని కార్యాలయాల్లో అవినీతి అధికారులున్నా.. తహశీల్దార్​ కార్యాలయాల్లో మాత్రం లంచాలకు మరిగిన అధికారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి భయం లేకుండా లంచం డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ తహశీల్దార్​ (Tahsildar) ఏసీబీకి చిక్కాడు. జగిత్యాల (Jagityala) జిల్లా రాయికల్ (Rayikal)​ మండల ఇన్​ఛార్జి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలోని తహశీల్దార్​ కార్యాలయాలు (Tahsildar offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. నిత్యం ఏదో ఒక కార్యాలయంలో లంచం తీసుకుంటూ అధికారులు ఏసీబీ(ACB)కి చిక్కుతున్నారు. అన్ని కార్యాలయాల్లో అవినీతి అధికారులున్నా.. తహశీల్దార్​ కార్యాలయాల్లో మాత్రం లంచాలకు మరిగిన అధికారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి భయం లేకుండా లంచం డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ తహశీల్దార్​ (Tahsildar) ఏసీబీకి చిక్కాడు.

జగిత్యాల (Jagityala) జిల్లా రాయికల్ (Rayikal)​ మండల ఇన్​ఛార్జి తహశీల్దార్​, జటంగుల గణేష్ లంచం తీసుకుంటూ దొరికాడు. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవసాయ భూమిని నమోదు చేయడానికి ఆయన లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం బాధితుడి నుంచి రూ.పది వేల లంచం తీసుకుంటుండగా ఇన్​ఛార్జి తహశీల్దార్​ గణేష్​, ప్రైవేట్​ దస్తవేజు లేఖరుడు మహ్మద్ ముజఫర్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ACB Trap | భయపడాకుండా ఫిర్యాదు చేయాలి

ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...