Swaraj Kaushal | సుష్మా స్వరాజ్​ భర్త కన్నుమూత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swaraj Kaushal | దివంగత బీజేపీ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (Sushma Swaraj)​ భర్త స్వరాజ్​ కౌశల్ (73)​ గురువారం కన్నుమూశారు. మిజోరాం (Mizoram) మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ అనారోగ్య కారణాలతో ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ చనిపోయారు. కౌశల్​ 1952 జులై 12న హిమాచల్‌ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) సోలన్‌లో జన్మించారు. 37 ఏళ్లకే మిజోరం గవర్నర్​గా నియమితులయ్యారు. ఆయన భార్య సుష్మా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swaraj Kaushal | దివంగత బీజేపీ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (Sushma Swaraj)​ భర్త స్వరాజ్​ కౌశల్ (73)​ గురువారం కన్నుమూశారు. మిజోరాం (Mizoram) మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ అనారోగ్య కారణాలతో ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ చనిపోయారు.

కౌశల్​ 1952 జులై 12న హిమాచల్‌ ప్రదేశ్‌లోని (Himachal Pradesh) సోలన్‌లో జన్మించారు. 37 ఏళ్లకే మిజోరం గవర్నర్​గా నియమితులయ్యారు. ఆయన భార్య సుష్మా స్వరాజ్‌ ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రిగా పని చేశారు. భారత విదేశాంగమంత్రిగా సేవలందించారు. 2019 ఆగస్టు 6న ఆమె చనిపోయారు.

కౌశల్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ప్రస్తుతం న్యూఢిల్లీ ఎంపీగా ఉన్నారు. ఆమె తన తండ్రి మృతిపై ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు. తన తండ్రి ఆప్యాయత, క్రమశిక్షణ, సరళత, దేశభక్తి, ఓర్పు తన జీవితానికి వెలుగు అని, అది ఎప్పటికీ తగ్గదన్నారు. మధ్యాహ్నం కౌశల్ ఛాతీ నొప్పి రావడంతో AIIMS కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారని బీజేపీ నాయకులు తెలిపారు.

Swaraj Kaushal | ప్రధాని సంతాపం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మిజోరాం మాజీ గవర్నర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. స్వరాజ్ కౌశల్ జీ మరణం బాధాకరం. న్యాయవాదిగా మరియు నిరుపేదల జీవితాలను మెరుగుపరచడానికి న్యాయవాద వృత్తిని ఉపయోగించడంలో నమ్మకం ఉంచిన వ్యక్తిగా ఆయన తనను తాను ప్రత్యేకించుకున్నారు అని ప్రధాని మోదీ ‘ఎక్స్​’లో పోస్ట్​ చేశారు.

దేశంలో అతి చిన్న వయసులో గవర్నర్ అయ్యారని గుర్తు చేశారు. గవర్నర్‌గా తన పదవీకాలంలో మిజోరాం ప్రజలపై శాశ్వత ముద్ర వేశారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ సీఎం రేఖాగుప్తా స్వరాజ్ కౌశల్ అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...