అక్షరటుడే, వెబ్డెస్క్: NCERT Book Ban | ఎన్సీఈఆర్టీపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్సీఈఆర్టీ ముద్రించిన ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకాన్ని నిషేధించింది.
సోషల్ పుస్తకంలో ఎన్సీఈఆర్టీ న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ముద్రించింది. దీనిని సుమోటాగా స్వీకరించిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఆ పాఠ్యపుస్తకాన్ని పునర్ ముద్రించడం, డిజిటల్గా వ్యాప్తి చేయడాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది, ఇందులో న్యాయవ్యవస్థలో “అవినీతి” అనే అధ్యాయం – ‘మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర’ – ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిని న్యాయవ్యవస్థపై కుట్రగా అని అభివర్ణించింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న పుస్తకాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
NCERT Book Ban | అపకీర్తిపాలు చేసేలా..
న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ప్రస్తావించడంపై తీవ్రంగా విమర్శించిన సుప్రీంకోర్టు పాఠశాల విద్య కార్యదర్శి, విద్యా మంత్రిత్వ శాఖ, NCERT డైరెక్టర్లకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ పుస్తక ప్రచురణ తీవ్రమైన దుష్ప్రవర్తన అని, న్యాయవ్యవస్థను అపకీర్తి పాలు చేసేలా ఉందన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య అని రుజువైతే కోర్టు ధిక్కార పరిధిలోకి వస్తుందని తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) వాదనలు వినిపిస్తూ.. అనర్హమైన, బేషరతుగా క్షమాపణలు ప్రచురించబడతాయని, అధ్యాయాన్ని తయారు చేసిన వ్యక్తులు ఏ మంత్రిత్వ శాఖలోని ఏ అధ్యాయం లేదా ఏదైనా పని తయారీతో సంబంధం కలిగి ఉండరని అన్నారు. కాగా బుధవారం NCERT న్యాయవ్యవస్థకు క్షమాపణ చెప్పింది. ఇలాంటి చర్యలతో విద్యార్థులు, యువతలో న్యాయ వ్యవస్థపై పవిత్రత దెబ్బతినే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
