Heavy rains | ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు.. చిక్కుకున్న విద్యార్థులు..

అక్షరటుడే, కామారెడ్డి: Heavy rains | మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో 15 మంది విద్యార్థులు చిక్కుకున్న ఘటన సదాశివనగర్ (Sadashivanagar) మండలం అమర్లబండలో (amarla banda) శనివారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో విద్యార్థులు ప్రతిరోజూ ధర్మరావుపేట గ్రామానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న రాజగుండ వాగు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఉదయం వాగులో […]

అక్షరటుడే, కామారెడ్డి: Heavy rains | మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో 15 మంది విద్యార్థులు చిక్కుకున్న ఘటన సదాశివనగర్ (Sadashivanagar) మండలం అమర్లబండలో (amarla banda) శనివారం చోటుచేసుకుంది.

గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామంలో హైస్కూల్ లేకపోవడంతో విద్యార్థులు ప్రతిరోజూ ధర్మరావుపేట గ్రామానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న రాజగుండ వాగు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఉదయం వాగులో అంతగా నీళ్లు లేకపోవడంతో విద్యార్థులు స్కూల్​కు వెళ్లారు. వర్షాలు పడుతుండడంతో త్వరగానే స్కూల్​కు వెళ్లారు. కాగా.. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. విషయం తెలుసుకున్న సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై పుష్పరాజ్ గ్రామానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో కేజ్ వీల్ సహాయంతో విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. మరికొంత మంది రైతులు సైతం వాగుకు అటువైపు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. వారిని ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

వర్షాలు కురిసిన సమయంలో రాజగుండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నెల 19న రాత్రి వ్యవసాయ పనులకు వెళ్లిన ఐదుగురు రైతులు వాగులో చిక్కుకోగా ట్రాక్టర్ల సహాయంతో గ్రామస్థులు ఒడ్డుకు చేర్చారు. సరిగ్గా వారం రోజులకు అదే వాగులో శనివారం 15 మంది విద్యార్థులు చిక్కుకున్నారు.

Heavy rains | బ్రిడ్జి నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుందని ఏర్పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇదే దారి ఉందని చెప్తున్నారు. బ్రిడ్జి నిర్మిస్తే తప్ప తమకు ఈ బాధలు తీరవని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...