Homeజిల్లాలుకామారెడ్డిMLA Laxmi Kantha Rao | విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలి: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

MLA Laxmi Kantha Rao | విద్యార్థుల ప్రతిభను వెలికితీయాలి: ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

విద్యార్థుల ప్రతిభను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. పెద్దకొడప్​గల్​ మండల కేంద్రంలో జిల్లా పరిషత్​ పాఠశాలలో అదనపు గదులను ఆయన ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, పెద్దకొడప్​గల్ ​: MLA Laxmi Kantha Rao | విద్యార్థుల ప్రతిభను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (MLA Laxmi Kantha Rao) పేర్కొన్నారు. పెద్దకొడప్​గల్​ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల (Zilla Parishad High School)లో అదనపు తరగతి గదులను మంగళవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీఎంశ్రీ రూ.54 లక్షల నిధులతో తరగతి గదుల నిర్మాణం చేపట్టామన్నారు. పాఠశాలల్లో 378 విద్యార్థులు చదువుకుంటుండడం అభినందనీయమన్నారు. జుక్కల్​ నియోజకవర్గం (Jukkal Constituency)లో విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్​ పాఠశాలను మంజూరు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. నేటితరంలో టెక్నాలజీ ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల పాఠాలు బోధించాలన్నారు. విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఎల్లప్పుడూ తాను ముందుంటానని ఆయన స్పష్టం చేశారు.