Homeజిల్లాలునిజామాబాద్​Wrestling competitions | జాతీయస్థాయి కుస్తీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

Wrestling competitions | జాతీయస్థాయి కుస్తీ పోటీలకు విద్యార్థుల ఎంపిక

బోధన్​ మండలంలోని అమ్దాపూర్​ జడ్పీహెచ్​ విద్యార్థులు రిజ్వాన్​, వైష్ణవి జాతీయస్థాయి కుస్తీపోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్: Wrestling competitions | మండలంలోని అమ్దాపూర్​ జడ్పీహెచ్​ఎస్​ విద్యార్థులు (Amdapur ZPHS Students) జాతీయస్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు.

పాఠశాలకు చెందిన రిజ్వాన్​ అనే విద్యార్థి ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి కుస్తీలో బంగారు పతకం (gold medal) సాధించి జాతీయస్థాయికి ఎంపికయ్యాడని..అలాగే విద్యార్థిని వైష్ణవి వెండి పతకం (silver medal) సాధించి తాను సైతం జాతీయపోటీలకు సెలెక్ట్​ అయిందని హెచ్​ఎం సూర్యకుమార్​ తెలిపారు. ఈ మేరకు వీరిరువురిని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి (MLA Sudarshan Reddy) సోమవారం సన్మానించారు. జాతీయస్థాయిలో ప్రతిభచూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ సునీత పాల్గొన్నారు.