అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cyber Crime | మండల కేంద్రంలోని మోడల్ జూనియర్ కళాశాలలో (Model Junior College) విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఫోన్లలో అనవసరమైన యాప్లను డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దన్నారు. సైబర్ నేరానికి గురయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930, లేదా ఎల్లారెడ్డి షీటీం సభ్యులు సుప్రజ టోల్ ఫ్రీ నంబర్ 8712686094ను సంప్రదించాలని సూచించారు.
అలాగే సైబర్ నేరాలు, ఉమెన్ ట్రాఫికింగ్పై పోలీస్ కళాజాత బృందం సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్ఛార్జి హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శేషారావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, కళాశాల ప్రిన్సిపాల్ గాంధీ, ఉపాధ్యాయులు జహంగీర్, ప్రియదర్శిని, లక్ష్మణ్, రాజశేఖర్, బల్వంత్ రావు, విద్యారమణ తదితరులు పాల్గొన్నారు.
