అక్షరటుడే, కమ్మర్పల్లి: Kammarpally | కమ్మర్పల్లి మండల ఇంగ్లిష్ ఉపాధ్యాయుల అసోసియేషన్ ఆధ్వర్యంలో మండంలంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్ (English Talent Test) నిర్వహించారు. మండలంలోని ఎమ్మార్సీ భవన్లో (MRC Bhavan) భారతీ ఎయిర్టెల్, టీఎస్ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ భాషపై విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు.
దీంట్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చూపి బహుమతులు గెలుచుకున్నారు. పోటీలో జూనియర్ విభాగంలో జడ్పీహెచ్ఎస్ బషీరాబాద్ విద్యార్థి చిన్నబాబు మొదటిస్థానంలో నిలవగా.. చౌట్పల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి రూపేష్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. సీనియర్స్ విభాగంలో బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి అమూల్య మొదటి స్థానంలో నిలవగా మధుప్రియ రెండో స్థానంలో నిలిచారు.
వ్యాసరచన పోటీలో కోనసముందర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి శివాగౌడ్ విద్యార్థి ప్రథమస్థానంలో, చౌట్పల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ప్రసన్న రెండోస్థానంలో నిలిచారు. సీనియర్స్ విభాగంలో కమ్మర్పల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి కార్తికేయ మొదటిస్థానంలో, కోనసముందర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి సందీప్ రెండోస్థానంలో నిలిచారు. విజేతలకు ఎంఈవో ఆంధ్రయ్య బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈఎల్టీఏ ఉపాధ్యాయులు రవీంద్ర, మహికాంత్, మధుబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అబ్జర్వర్గా మోర్తాడ్ మండల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు గున్నాల రవి వ్యవహరించారు.
