Homeతాజావార్తలుCP Sajjanar | ఫోన్​ చూస్తూ డ్రైవింగ్​ చేస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్​ వార్నింగ్​

CP Sajjanar | ఫోన్​ చూస్తూ డ్రైవింగ్​ చేస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్​ వార్నింగ్​

వాహనదారులు నిబంధనలు పాటించాలని హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ సూచించారు. ఫోన్​ చూస్తూ డ్రైవింగ్​ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: CP Sajjanar | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయినా కూడా కొందరు వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు.

నగరంలో చాలా మంది వాహనదారులు ఫోన్​ చూస్తూ డ్రైవింగ్​ చేస్తున్నారు. ముఖ్యంగా కారు, ఆటోలు నడిపేవారు ఫోన్లలో వీడియోలు చూస్తున్నారు. పలువురు ఫోన్​ మాట్లాడుతూ డ్రైవింగ్​ చేస్తున్నారు. దీంతో అలాంటి వారికి హైదరాబాద్​ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వార్నింగ్​ ఇచ్చారు. డ్రైవింగ్‌ సమయంలో ఫోన్‌లో వీడియోలు చూడటం, ఇయర్‌ఫోన్స్‌ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఛరించారు.

CP Sajjanar | నిబంధనలు పాటించాలి

ఆటో, క్యాబ్‌, బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లు (taxi drivers) ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. స్వీయ, ప్రయాణీకులు తోటి రోడ్డు వినియోగదారుల భద్రత చాలా ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు పోతాయన్నారు. డ్రైవింగ్​ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.