Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. విమాన రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను బలపడడంతో తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరానికి 270 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ సమీపంలో ఉంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. మొంథా తుపాను మచిలీపట్నం – కాకినాడ మధ్య ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. మొంథా ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ వాతావరణ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyclone Montha | బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాను బలపడడంతో తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరానికి 270 కిలోమీటర్ల దూరంలో, కాకినాడ సమీపంలో ఉంది.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. మొంథా తుపాను మచిలీపట్నం – కాకినాడ మధ్య ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. మొంథా ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) ప్రకారం.. వచ్చే 24 గంటల్లో నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ , మరో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Cyclone Montha | వ‌ర్షాలే వ‌ర్షాలు..

తెలంగాణలో (Telangana) కూడా తుపాను​ ప్రభావం కనిపిస్తోంది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఆదిలాబాద్‌, జనగామ, ఖమ్మం, కొమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, సూర్యాపేట ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో (Hyderabad) కూడా బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. సముద్రం ఉప్పొంగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్ర యాత్రలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఎయిర్ ఇండియా, ఇండిగో సర్వీసులు కూడా ర‌ద్ద‌య్యాయి. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో విమాన సర్వీసులు (Indigo Flights) కూడా ర‌ద్ద‌యిన‌ట్టు తెలుస్తోంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...