Homeజిల్లాలుకామారెడ్డిJubilee Hills by Election | రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యం

Jubilee Hills by Election | రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యం

తెలంగాణ అభివృద్ధి కేవలం కాంగ్రెస్​తోనే సాధ్యమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు.

- Advertisement -

అక్షరటుడే, భిక్కనూరు : Jubilee Hills by Election | కాంగ్రెస్​ ప్రభుత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్​ రెడ్డి (Indrakaran Reddy) అన్నారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక (Jubilee Hills by Election) సందర్భంగా ఆయన ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్యతో కలిసి పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో భాగంగా బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. ఓటర్లు వారి ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోందని చెప్పారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్​ నాయకులు ఉన్నారు.