అక్షరటుడే, ఆర్మూర్: SRSP | శ్రీరాంసాగర్లోకి (Sriram Sagar project) ఇన్ఫ్లో స్వల్పంగా వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురవకపోవడంతో ఇన్ఫ్లో వరద నీరు తగ్గుముఖం పట్టింది.
SRSP | 2,172 క్యూసెక్కుల మేరకు..
ప్రస్తుతం ప్రాజెక్ట్లోకి 2,172 మేర ఇన్ఫ్లో వస్తోంది. ఆదివారం 3,653 క్యూసెక్కులు వచ్చింది. రోజురోజుకూ ఇన్ఫ్లో తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్ట్లో 359 క్యూసెక్కులు ఆవిరి రూపంలో వెళ్లిపోతుంది. మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు ఎగువన వర్షాలు పడకపోవడంతో ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20.902 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 12.788 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
SRSP | అక్టోబర్ వరకు బాబ్లీ గేట్లు ఓపెన్..
సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాల మేరకు జూలై 1న బాబ్లీ గేట్లు (Babli Gates) తెరిచారు. అక్టోబర్ 29వ తేదీ వరకు గేట్లు తెరిచి ఉంచుతారు. ఎగువన కురిసే వర్షాలకు వచ్చే నీరు అక్టోబర్ 29 వరకు నేరుగా ఎస్సారెస్పీకి చేరుతుంది. గతేడాది బాబ్లీ ద్వారా 293 టీఎంసీల నీరు శ్రీరాంసాగర్లోకి రాగా యాసంగి పంటలకు ప్రాజెక్ట్ పరిధిలోని 6,24,000 ఎకరాలకు 73 టీఎంసీల నీటిని అందించారు. మిడ్ మానేరు, మల్లన్న సాగర్ తో పాటు వివిధ ప్రాజెక్టులకు కాల్వల ద్వారా సాగు, తాగు నీటిని అందించారు.