అక్షరటుడే, మెండోరా: Sriram sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికి ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వస్తోంది.
దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండి గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు (Sriram sagar Project) పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1091.90 అడుగుల (80.051 టీఎంసీలు)కు చేరింది.
Sriram sagar | కాల్వల ద్వారా కొనుసాగుతున్న విడుదల
వరద నీరు భారీగా చేరుతున్న (heavy inflow) నేపథ్యంలో ప్రాజెక్టు నుండి వివిధ కాల్వల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3,000 క్యూసెక్కులు వదులుతున్నారు. సరస్వతి కాలువ (Saraswati canal) ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు పోను అదనంగా 573 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. అలాగే, ఎఫ్ఎఫ్సీ అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.