అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Railway Station | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా గురువారం సాయంత్రం రైల్వే స్టేషన్లో స్పెషల్ పార్టీ పోలీసులు (Special Party Police) ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.
లోకల్ పోలీస్ డాగ్ స్క్వాడ్(Dog Squad) టీంతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది అనుమానితుల లగేజీని తనిఖీ చేశారు. స్టేషన్లోని ప్లాట్ఫాంలు, రైళ్లు, పార్సిల్ కార్యాలయం, పార్కింగ్ ప్రాంగణం, సర్క్యులేటింగ్ ఏరియాలో తనిఖీలు నిర్వహించారు. రైల్వే ఇన్స్పెక్టర్ వీవీ సుబ్బారెడ్డి, ఎస్సై హరిబాబు, జీఆర్బీ ఎస్సై సాయి రెడ్డి, నిజామాబాద్ బీడీడీఎస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.