Election Commission | త్వరలో తెలంగాణలో ఎస్​ఐఆర్​ ప్రక్రియ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Election Commission | రాష్ట్రంలో త్వరలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) (Special Integrated Revision) నిర్వహించనున్నట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (Chief Election Commissioner Gyanesh Kumar) తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లో పర్యటించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఎస్​ఐఆర్​ ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీహార్​లో ఈ ప్రక్రియ పూర్తయింది. పశ్చిమ బెంగాల్​లో (West Bengal) సైతం 58 లక్షల […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Election Commission | రాష్ట్రంలో త్వరలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) (Special Integrated Revision) నిర్వహించనున్నట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ (Chief Election Commissioner Gyanesh Kumar) తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లో పర్యటించారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఎస్​ఐఆర్​ ప్రక్రియ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీహార్​లో ఈ ప్రక్రియ పూర్తయింది. పశ్చిమ బెంగాల్​లో (West Bengal) సైతం 58 లక్షల ఓట్లను తొలగించారు. డ్రాఫ్ట్​ జాబితాను ప్రచురించారు. ఎస్​ఐఆర్​పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. ఎన్నికల సంఘం ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఈసీ జ్ఞానేశ్​కుమార్ వెల్లడించారు.

Election Commission | విజయవంతం చేయాలి

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం రవీంద్ర భారతిలో బీఎల్‍వోలతో సమావేశం నిర్వహించారు. బీహార్​లో బీఎల్​వోలు ఈ ప్రక్రియను విజయవంతంగా చేశారన్నారు. నెక్స్ట్​ తెలంగాణలో ఈ ప్రక్రియ చేపడుతామన్నారు. తెలంగాణలో సగటున 930 మంది ఓటర్లు ఒక బీఎల్వో పరిధికిలోకి వస్తారని చెప్పారు.

దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ప్రక్రియ నడుస్తోందన్నారు. మిగతా రాష్ట్రాల్లో సైతం త్వరలో చేపడుతామని స్పష్టం చేవారు. రాజ్యాంగానికి అతిపెద్ద సైనికుడు బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఆయన కొనియాడారు. కాగా అంతకు ముందు ఆయనను పలువురు అధికారులు కలిశారు. హైదరాబాద్​ సీపీ సజ్జనార్​ (Hyderabad CP Sajjanar) సీఈసీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...