IND vs SA | సౌతాఫ్రికా ఆలౌట్​.. భారత్​ టార్గెట్​ 271 పరుగులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: IND vs SA | దక్షిణాఫ్రికాతో (South Africa ) విశాఖపట్నంలో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సఫారీ జట్టు ఆలౌట్​ అయ్యింది. టాస్​ ఓడి ముందుగా బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా టీం నిర్ణీత 50 ఓవర్లు పూర్తి చేయకముందే వెనుదిరిగింది. 47.5 ఓవర్లలో 270 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ గెలుపుకోసం 271 పరుగులు చేయాల్సి ఉంది. IND vs SA | క్వింటన్​ సెంచరీ సఫారీ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ క్వింటన్ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: IND vs SA | దక్షిణాఫ్రికాతో (South Africa ) విశాఖపట్నంలో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో సఫారీ జట్టు ఆలౌట్​ అయ్యింది. టాస్​ ఓడి ముందుగా బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా టీం నిర్ణీత 50 ఓవర్లు పూర్తి చేయకముందే వెనుదిరిగింది. 47.5 ఓవర్లలో 270 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ గెలుపుకోసం 271 పరుగులు చేయాల్సి ఉంది.

IND vs SA | క్వింటన్​ సెంచరీ

సఫారీ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ క్వింటన్ డి కాక్ (Quinton de Kock) ఒక్కడే నడిపించాడు. 106 పరుగులతో అద్భుత శతకం సాధించిన అతను జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. కెప్టెన్ తెంబా బవుమా (Captain Temba Bavuma) 48 పరుగులు జోడించగా.. మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో దక్షిణాఫ్రికా పరుగుల జోరు ఆగిపోయింది.

భారత బౌలింగ్ విభాగం అద్భుత ప్రదర్శన కనబర్చింది. చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ (Kuldeep Yadav), యార్కర్ స్పెషలిస్ట్ ప్రసిద్ధ్ కృష్ణలు చెరో నాలుగేసి వికెట్లు పడగొట్టి సఫారీ జట్టు వెన్ను విరిచారు. అర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజాలు తలో ఒక్కో వికెట్ తీశారు. భారత్ 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్​కు దిగనుంది. సిరీస్‌లో ఆధిక్యం సాధించేందుకు ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకం.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...