అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | డబ్బులు, బంగారం ఇవ్వడం లేదని మద్యం మత్తులో తల్లిపై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) తెలిపారు. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Kamareddy | కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణంలోని వివేకానంద కాలనీకి (Vivekananda Colony) చెందిన కంచర్ల గౌరవ్వ వద్ద ఉన్న డబ్బు, మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసు తీసుకోవడానికి కొడుకు రాజేష్ ప్రయత్నించగా గౌరవ్వ నిరాకరించింది. దాంతో మద్యం మత్తులో ఉన్న రాజేష్ తన చేతికి ఉన్న కడియంతో గౌరవ్వపై దాడి చేయగా తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయింది. పోలీసులకు సమాచారం రావడంతో గౌరవ్వ పరిస్థితి గమనించిన పోలీసులు పెట్రోకార్లో జీజీహెచ్కు తరలించారు. అనంతరం తల్లి వద్ద నుంచి తీసుకున్న బంగారు గొలుసును జేపీఎన్ రోడ్డులో అమ్మడానికి ప్రయత్నించిన రాజేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి బంగారు గొలుసు, కడియం, మొబైల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గౌరవ్వకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుందన్నారు. తల్లిదండ్రుల బాధ్యత కొడుకులపై ఉంటుందని, వారిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చట్టాలు ఉన్నాయని ఏఎస్పీ గుర్తు చేశారు.
Kamareddy | ఇంటికి తీసుకెళ్తామని చెప్పి నగదు, మొబైల్ చోరీ
కల్లు తాగి మత్తులో ఉన్న వ్యక్తిని ఇంటికి తీసుకెళ్తామని చెప్పి అతని వద్ద మొబైల్, డబ్బులు చోరీ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఈనెల 13న పట్టణానికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న కల్లు దుకాణంలో కల్లు తాగాడు. మత్తులో ఉన్న ఇర్ఫాన్ను గుర్తించిన ఇస్లాంపురాకు చెందిన ఖుతుబొద్దీన్, సమీర్లు బైక్పై ఇంటికి తీసుకెళ్తామని నమ్మించారు. బైక్పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతని వద్ద ఉన్న మొబైల్, రూ.700 నగదు తీసుకుని పారిపోయారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఖుతుబొద్దీన్, సమీర్లను అరెస్ట్ సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామంటే నమ్మి వాళ్లవెంట వెళ్లవద్దని ఏఎస్పీ సూచించారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్సై బాల్ రెడ్డి పాల్గొన్నారు.