Panchayat elections | పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై నిఘా

అక్షరటుడే, లింగంపేట : Panchayat elections | స్థానిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని ఎల్లారెడ్డి డీఎస్పీ (Yellareddy DSP) శ్రీనివాసరావు అన్నారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా లో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు పెట్టినా, వదంతులు వ్యాప్తి చేసినా వారిపై, గ్రూప్ అడ్మిన్​పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన, ప్రచారం చేసినా […]

అక్షరటుడే, లింగంపేట : Panchayat elections | స్థానిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని ఎల్లారెడ్డి డీఎస్పీ (Yellareddy DSP) శ్రీనివాసరావు అన్నారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సోషల్ మీడియా లో ప్రజలను రెచ్చగొట్టే పోస్టులు, వీడియోలు పెట్టినా, వదంతులు వ్యాప్తి చేసినా వారిపై, గ్రూప్ అడ్మిన్​పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన, ప్రచారం చేసినా ఎన్నికల కోడ్ ఆధారంగా వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలకు సంబందించిన విధులు, బందోబస్తు గురించి సూచనలు చేసారు. ఈ సమావేశం లో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎస్​ఎస్​ నగర్​ సీఐ సంతోష్, ఎస్సైలు మహేష్, భార్గవ్, దీపక్ కుమార్, నరేష్ , ఆంజనేయులు, పుష్పరాజ్ పాల్గొన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...