41
అక్షరటుడే, ఆర్మూర్ : Aloor | ఆలూర్ మండలం మిర్దాపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై ఆదివారం సాయంత్రం దాడి చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. పేకాడుతున్న ఆరుగురిని పట్టుకున్నామని చెప్పారు. వారి నుంచి రూ.48,800 నగదు, రెండు బైక్లు, ఒక కారు, ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.