Phone tapping case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone tapping case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్ (SIT)​ దూకుడు పెంచింది. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)​కు తాజాగా నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్ కేసులో సిట్​ అధికారులు ఇటీవల మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao)ను విచారించిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయనను సుమారు 7 గంటల పాటు సిట్​ ప్రశ్నించింది. తాజాగా కేటీఆర్​కు నోటీసులు జారీ చేసింది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone tapping case | ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్ (SIT)​ దూకుడు పెంచింది. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)​కు తాజాగా నోటీసులు జారీ చేసింది.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్ కేసులో సిట్​ అధికారులు ఇటీవల మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao)ను విచారించిన విషయం తెలిసిందే. మంగళవారం ఆయనను సుమారు 7 గంటల పాటు సిట్​ ప్రశ్నించింది. తాజాగా కేటీఆర్​కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని పేర్కొంది.

Phone tapping case | నోటీసుల డ్రామా

కేటీఆర్​కు నోటీసులపై మాజీ మంత్రి హరీశ్​రావు స్పందించారు. బొగ్గు స్కాం (Coal Scam)పై సమాధానం చెప్పే దమ్ములేకనే రేవంతు నోటీసుల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ (congress) వరుస స్కాంల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులు ఇస్తోందన్నారు. రేవంతు బామ్మర్ది బొగ్గు స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు మండిపడ్డారు. ప్రతీకారం అనేది బలహీనుల ఆయుధం అన్నారు. నోటీసులకు సమాధానాలు చెప్పడానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామన్నారు.

బీఆర్​ఎస్​ హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక కేసు నమోదు అయింది. దాదాపు రెండేళ్లుగా కేసు విచారణ సాగుతోంది. అయితే ప్రభుత్వం విచారణ వేగవంతం చేయడానికి ఇటీవల సిట్​ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ పెద్దలు చెప్పడంతోనే ఫోన్​ ట్యాపింగ్​ జరిగినట్లు సిట్​ భావిస్తోంది. ఈ క్రమంలో విచారణ చేస్తోంది. ఇటీవల ప్రభాకర్​రావుతో పాటు బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ నవీన్​రావు, న్యూస్​ ఛానెల్​ ఎండీ శ్రవణ్​రావును విచారించారు. ఇటీవల హరీశ్​రావును ప్రశ్నించారు. మరోసారి ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. తాజాగా కేటీఆర్​కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో కేసీఆర్​ (KCR)ను సైతం విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...