Naini Coal Mines | సింగరేణి కీలక నిర్ణయం.. నైనీ కోల్ మైన్స్ టెండర్లు రద్దు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Naini Coal Mines | సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా పరమైన కారణాలతో నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒడిశాలోని నైనీ బొగ్గు గనులకు సింగరేణి (Singareni) గతంలో టెండర్లు పిలిచింది. ఈ విషయంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండేవారికి టెండర్లు కట్టబెట్టడానికి సైట్​ విజిట్​ సర్టిఫికెట్ విధానం తెచ్చారని […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Naini Coal Mines | సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా పరమైన కారణాలతో నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఒడిశాలోని నైనీ బొగ్గు గనులకు సింగరేణి (Singareni) గతంలో టెండర్లు పిలిచింది. ఈ విషయంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉండేవారికి టెండర్లు కట్టబెట్టడానికి సైట్​ విజిట్​ సర్టిఫికెట్ విధానం తెచ్చారని బీఆర్​ఎస్​ (BRS) ఆరోపించిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka)పై సైతం ఈ టెండర్ల విషయంలో ఓ వార్త పత్రికలో ఆరోపణలు ప్రచురించింది. దీంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెండర్లు రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాజాగా టెండర్​ నోటిఫికేషన్​ రద్దు చేస్తూ సింగరేణి నిర్ణయం తీసుకుంది.

Naini Coal Mines | గతంలో సైతం..

నోటిఫికేషన్​ ప్రకారం ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి నైనీ గనుల బిడ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లు SCCL ప్రకటించింది. నైనీ టెండర్ల విషయంలో సింగరేణి పాలకమండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ఎందుకు చర్చించలేదని సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ఆరా తీశారు. ఒకవేళ చర్చిస్తే.. టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. టెండర్ వేయదలచిన కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధ్రువీకరణ పత్రాలు (Site Visit Certificate) ఎందుకు ఇవ్వడం లేదన్నారు. దీంతో టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని సింగరేణి అధికారులు తెలిపారు. నిబంధనలు, టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా 2016లో సైతం నైనీ టెండర్ల విషయంలో ఆరోపణలు వచ్చాయి. అప్పుడు కూడా అధికారులు రద్దు చేశారు. తాజాగా రెండోసారి నైనీ కోల్ మైన్స్ టెండర్స్ రద్దు కావడం గమనార్హం.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...