ACB | రూ.10 వేలకు కక్కుర్తిపడి.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB : రాష్ట్రంలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఎంత మంది అధికారులు ఏసీబీ(ACB)కి పట్టుబడుతున్నా.. లంచాలకు మరిగిన వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా లంచం (Bribe Taking) తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి దొరికాడు. నాగర్​ కర్నూల్​ జిల్లా (Nagar Kurnool district) కల్వకుర్తి పోలీస్​ స్టేషన్ (Kalvakurthi Police Station) లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న జమాల్​పురి రాంచందర్​జీ రూ.10 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB : రాష్ట్రంలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఎంత మంది అధికారులు ఏసీబీ(ACB)కి పట్టుబడుతున్నా.. లంచాలకు మరిగిన వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా లంచం (Bribe Taking) తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీకి దొరికాడు.

నాగర్​ కర్నూల్​ జిల్లా (Nagar Kurnool district) కల్వకుర్తి పోలీస్​ స్టేషన్ (Kalvakurthi Police Station) లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న జమాల్​పురి రాంచందర్​జీ రూ.10 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కాడు. ఫిర్యాదుదారుడిపై నమోదైన కేసులో స్టేషన్​ బెయిల్​ ఇవ్వడానికి సదరు ఎస్సై రూ.పది వేలు లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆనిశా అధికారులు వల పన్ని అవినీతి పోలీసు అధికారిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB : సిరులు కురిపిస్తున్న స్టేషన్​ బెయిల్​

కొందరు పోలీసు అధికారులు ఇటీవల అన్నింటా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా స్టేషన్​ బెయిల్​ విషయంలో మరీ బరి తెగిస్తున్నారనే వాదన ఉంది. స్టేషన్​ బెయిల్​ ఇచ్చేందుకు కొందరు పోలీసు అధికారులు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తున్నారనే అభియోగాన్ని తాజా ఘటన నిజం చేస్తోంది.

ACB : లంచం అడిగితే ఫిర్యాదు చేయండి

ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​కు ఫోన్​ చేస్తే అవినీతి అధికారుల పని చెబుతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...