Cabinet Reshuffle | పలువురు మంత్రులపై వేటు తప్పదా.. త్వరలో మంత్రివర్గ పునర్​ వ్యవస్థీకరణ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Cabinet Reshuffle | రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతుంది. దీంతో ప్రజా పాలన వారోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్​ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet)​లో సీఎం రేవంత్​రెడ్డితో కలిసి 16 మంది ఉన్నారు. రాష్ట్రం 18 మంది మంత్రులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Cabinet Reshuffle | రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతుంది. దీంతో ప్రజా పాలన వారోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. డిసెంబర్​ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet)​లో సీఎం రేవంత్​రెడ్డితో కలిసి 16 మంది ఉన్నారు. రాష్ట్రం 18 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రిపదవి ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గాన్ని మార్చాలని కాంగ్రెస్​ నిర్ణయించినట్లు సమాచారం.

Cabinet Reshuffle | రెండు సార్లు విస్తరణ

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం చాలా మంది మంత్రి పదవులను ఆశించారు. మినిస్టర్​ పోస్ట్​ రేసులో అనేక మంది ఉండటంతో చాలాకాలం చర్చల తర్వాత కాంగ్రెస్​ జూన్​లో మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గడ్డం వివేక్​, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​, వాకిటి శ్రీహరిలకు పదవులు ఇచ్చింది. అనంతరం జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించింది. అజారుద్దీన్​కు కేబినెట్ బెర్త్​ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కేబినెట్​లో 16 మంది ఉన్నారు. మరో రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి.

Cabinet Reshuffle | కొత్తగా పలువురికి అవకాశం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఆది నుంచి మంత్రిపదవి ఆశిస్తున్నారు. పదవి రాకపోవడంతో ఆయన పలుమార్లు సీఎం రేవంత్​రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి (MLA Malreddy Ranga Reddy) సైతం పదవి ఆశించి భంగపడ్డాడు. ఈ క్రమంలో తాజాగా పునర్​ వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం కల్పించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ (Konda Surekha), పొన్నం ప్రభాకర్​తో పాటు మరో ఇద్దరిని మంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నంను ఏఐసీసీ కార్యదర్శిగా నియమిస్తారని సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నం ప్రభాకర్​ స్థానంలో ప్రస్తుతం పీసీసీ చీఫ్​గా కొనసాగుతున్న మహేశ్​కుమార్​గౌడ్​కు పదవి ఇస్తారని ప్రచారం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా శ్రీధర్​బాబును నియమించే ఛాన్స్​ ఉన్నట్లు సమాచారం. త్వరలో పునర్​ వ్యవస్థీకరణ చేపడుతారని తెలుస్తోంది.

Cabinet Reshuffle | పంచాయతీ ఎన్నికల తర్వాతే..

రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) ప్రక్రియ సాగుతోంది. డిసెంబర్​ 17న మూడో దశ ఎన్నికలు ముగియనున్నాయి. ఆ తర్వాతే మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...