Nizamabad market | రాత్రివేళ దుకాణాలను 11:30 గంటల వరకు తెరిచి ఉంచుతాం.. అనుమతి ఇవ్వరూ.. సీపీకి వ్యాపారుల విన్నపం

అక్షరటుడే, ఇందూరు: Nizamabad market : దుకాణాలను రాత్రి వేళ 11:30 గంటల వరకు తెరిచి ఉంచుతామని, అనుమతి ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్​ నగరంలోని వ్యాపారులు ఏఐఎంఐఎం Aimim ఆధ్వర్యంలో సీపీ సాయి చైతన్యకు cp sai Chaitanya వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ మార్కెట్‌ను మూసివేసేందుకు ప్రతిరోజూ రాత్రి 10:30 గంటలకు పోలీసు వాహనం గస్తీ తిరుగుతోందని, శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ప్రధానమైనప్పటికీ.. ఈ చర్య ప్రజలు, చిన్న వ్యాపారులకు, స్టాల్స్ హోల్డర్‌లకు, హోటళ్లు, ఫుడ్ కోర్టులు, […]

అక్షరటుడే, ఇందూరు: Nizamabad market : దుకాణాలను రాత్రి వేళ 11:30 గంటల వరకు తెరిచి ఉంచుతామని, అనుమతి ఇవ్వాలని కోరుతూ నిజామాబాద్​ నగరంలోని వ్యాపారులు ఏఐఎంఐఎం Aimim ఆధ్వర్యంలో సీపీ సాయి చైతన్యకు cp sai Chaitanya వినతిపత్రం అందజేశారు.

నిజామాబాద్ మార్కెట్‌ను మూసివేసేందుకు ప్రతిరోజూ రాత్రి 10:30 గంటలకు పోలీసు వాహనం గస్తీ తిరుగుతోందని, శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత ప్రధానమైనప్పటికీ.. ఈ చర్య ప్రజలు, చిన్న వ్యాపారులకు, స్టాల్స్ హోల్డర్‌లకు, హోటళ్లు, ఫుడ్ కోర్టులు, చిరు వ్యాపారులకు చాలా సవాళ్లను కలిగిస్తోందని వాపోయారు.

మార్కెట్ ను రాత్రి 10:30 గంటలకు ముందుగానే మూసివేయడం వల్ల చాలా మంది పౌరులు, ముఖ్యంగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేవారు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయలేకపోతున్నారని వ్యాపారులు పేర్కొన్నారు. సంబంధిత స్టేషన్ల పోలీసు అధికారులు రాత్రి 10:00 గంటలకే మూసివేయిస్తున్నారని తెలిపారు.

వాహన తనిఖీలు, పోలీసు పెట్రోలింగ్‌తో యువకులు తప్ప.. ఇతరులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ముఖ్యంగా వివాహ కార్యక్రమాలకు, వైద్య అత్యవసర పరిస్థితులకు వచ్చి వెళ్లేవారు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

పరిమితం చేయబడిన మార్కెట్ వేళల వల్ల చిన్న వ్యాపారులు వ్యాపారం నడవక ఆర్థికంగా చితికిపోతున్నారని వాపోయారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని నిర్దిష్ట రాత్రి వేళ గడువును 10:30 PM నుంచి 11:30 PM కి పొడిగించాలని కోరారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...