Swiggy Delivery Boy | అనంతపురం రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన.. ప్రాణం మీదుకు తెచ్చుకున్న‌ ఫుడ్ డెలివరీ ఏజెంట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swiggy Delivery Boy | అనంతపురం రైల్వే స్టేషన్  (Anantapur Railway Station) వద్ద గిగ్ వర్కర్ల భద్రతపై కొత్త ఆందోళన రేకెత్తించే ఘటన చోటు చేసుకుంది. ప్రాణాలకే ముప్పు కలిగించే పరిస్థితిలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రమాదానికి గుర‌య్యాడు. ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. ఒక ప్రయాణికుడు ఫస్ట్ ఏసీ కోచ్‌లో భోజనం ఆర్డర్ చేయ‌గా, స్విగ్గీ డెలివరీ ఏజెంట్ (Swiggy Delivery Agent) ఆర్డర్‌ను అందించడానికి రైలులోకి ఎక్కాడు. సాధారణంగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Swiggy Delivery Boy | అనంతపురం రైల్వే స్టేషన్  (Anantapur Railway Station) వద్ద గిగ్ వర్కర్ల భద్రతపై కొత్త ఆందోళన రేకెత్తించే ఘటన చోటు చేసుకుంది. ప్రాణాలకే ముప్పు కలిగించే పరిస్థితిలో ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రమాదానికి గుర‌య్యాడు. ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి.

ఒక ప్రయాణికుడు ఫస్ట్ ఏసీ కోచ్‌లో భోజనం ఆర్డర్ చేయ‌గా, స్విగ్గీ డెలివరీ ఏజెంట్ (Swiggy Delivery Agent) ఆర్డర్‌ను అందించడానికి రైలులోకి ఎక్కాడు. సాధారణంగా ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు రైల్లో ప్రయాణిస్తున్న వారికి పీఎన్‌ఆర్ ఆధారంగా ఆర్డర్ ఇవ్వడానికి సౌకర్యం కల్పిస్తాయి. అయితే, రైలు కేవలం 1-2 నిమిషాల కోసం మాత్రమే ఆగింది.

Swiggy Delivery Boy | స్విగ్గీ స్పందన

ఏజెంట్ బోగీలోకి చేరి భోజనం అందించిన తర్వాత రైలు కదిలింది. తొందరలో దిగే ప్రయత్నంలో ఆ వ్యక్తి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయాడు. ఈ ఘటన వీడియోగా బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా (Social Media)లో పెద్ద చర్చ మొదలైంది. సమాజంలో, గిగ్ వర్కర్లు ప్రతిరోజూ ఎదుర్కొనే ప్రమాదాలు, ఒత్తిడి, కఠినమైన టైమ్ లైన్‌లు ఈ ఘటన ద్వారా స్పష్టమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం వీరు ప్రాణాలను ప‌ణంగా పెడుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు, రైల్లో డెలివరీలను కచ్చితంగా పరిమితం చేయాలని, అవసరమైతే కేవలం స్టేషన్లలో మాత్రమే భోజనం అందించాలంటూ సూచనలు చేస్తున్నారు.

వీడియో వైరల్ కావడంతో (Viral Video) స్విగ్గీ స్పందిస్తూ, ఏజెంట్‌కి గాయాలు లేవు, ప్రాణాలకు ముప్పు లేదు అని తెలిపింది. రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం కంపెనీ ప్రోటోకాల్ ప్రకారం నిషేధం అని స్పష్టం చేసింది. భద్రత అత్యున్నత ప్రాధాన్యత అని, డెలివరీ పార్ట్‌నర్లకు ఇచ్చే భద్రతా శిక్షణను మ‌రింత‌ బలపరిచామని పేర్కొంది. ఈ ఘటన గిగ్ ఎకానమీ వర్కర్ల భద్రతపై కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతానికి కంపెనీలు, రైల్వే అధికారులు సంఘటనపై గమనించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన నియమాలు, శిక్షణా కార్యక్రమాలు అమలు చేయాలని సోషల్ మీడియాలో అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.

Related articles

Bijapur Maoist Encounter | బీజాపూర్​లో ఎన్​కౌంటర్​.. ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్​గఢ్​ జిల్లా బీజాపూర్​లో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

IAS Transfers Telangana | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్​ అధికారుల బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్​ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 45 మందికి స్థానచలనం కలిగిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Feb 26 Gold Prices | మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం.. వెండి ధ‌ర‌ ఎంతంటే!

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 26 Gold Prices | భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య అనిశ్చితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో...

Virosh Wedding Celebrations | మ‌రి కొద్ది గంట‌ల‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక‌ల వివాహం… ‘నో మొబైల్’ రూల్‌తో ప్రైవేట్ వెడ్డింగ్

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Virosh Wedding Celebrations | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26 ఉదయం 10.10 గంటలకు ఉద‌య్‌పూర్‌లో...