Hyderabad | తెగిపడిన విద్యుత్​ తీగ.. ఫుట్​పాత్​పై నిద్రిస్తున్న ఇద్దరి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఫుట్​పాత్(foot path)​పై నిద్రిస్తున్న ఇద్దరిని విద్యుత్​ తీగ బలిగొంది. ప్రశాంతంగా పడుకున్న వారిపై కరెంట్​ వైర్​ తెగిపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్​లోని ఎల్బీ నగర్​(LB Nagar) పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎల్బీ నగర్​ పరిధిలోని చింతలకుంట(Chintalakunta) రోడ్డు సాగర్ ​రిండ్​ రోడ్డు వద్ద ఎల్లమతల్లి ఆలయం సమీపంలో ఇద్దరు ఫుట్​పాత్​పై నిద్రిస్తున్నారు. ఒక మహిళ, ఒక పురుషుడు పడుకొని ఉండగా.. అర్ధరాత్రి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఫుట్​పాత్(foot path)​పై నిద్రిస్తున్న ఇద్దరిని విద్యుత్​ తీగ బలిగొంది. ప్రశాంతంగా పడుకున్న వారిపై కరెంట్​ వైర్​ తెగిపడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన హైదరాబాద్​లోని ఎల్బీ నగర్​(LB Nagar) పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

ఎల్బీ నగర్​ పరిధిలోని చింతలకుంట(Chintalakunta) రోడ్డు సాగర్ ​రిండ్​ రోడ్డు వద్ద ఎల్లమతల్లి ఆలయం సమీపంలో ఇద్దరు ఫుట్​పాత్​పై నిద్రిస్తున్నారు. ఒక మహిళ, ఒక పురుషుడు పడుకొని ఉండగా.. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో విద్యుత్​ తీగ తెగి వారిపై పడింది. దీంతో విద్యుత్​ షాక్​ తో వారు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ(osmaniya hospital mortuary)కి తరలించారు. వారి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, యాచకులు అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...