అక్షరటుడే, నిజామాబాద్సిటీ/ఆర్మూర్/బాల్కొండ : Drunk Drive | డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన పలువురికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. నిజామాబాద్ (Nizamabad) నగరంతో పాటు ఆర్మూర్లో న్యాయస్థానాల్లో మంగళవారం న్యాయమూర్తులు జైలుశిక్షతో పాటు భారీగా జరిమానాలు విధించారు.
Drunk Drive | నిజామాబాద్ నగరంలో..
నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) ఆధ్వర్యంలో పలుచోట్ల డ్రంకన్డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 35 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి 17 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. అలాగే ఒకరికి రూ.11,000 జరిమానా విధించారు. మరో ఏడుగురికి వారం రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
Drunk Drive | ఆర్మూర్ కోర్టులో ఐదుగురికి జరిమానా..
అక్షరటుడే, ఆర్మూర్ : డ్రంకన్ డ్రైవ్లో (Drunk Drive) ఐదుగురికి జరిమానా విధించారని ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చామన్నారు. విచారించిన న్యాయమూర్తి ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున న్యాయమూర్తి గంగాధర్ జరిమానా విధించారని తెలిపారు.
Drunk Drive | బాల్కొండలో నలుగురికి..
అక్షరటుడే, బాల్కొండ : బాల్కొండ పోలీస్ స్టేషన్ (Balkonda Police Station) పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన ట్లు ఎస్సై శైలేందర్ (SI Shailender) తెలిపారు. మండల పరిధిలో తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపున్నట్లుగా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా అతడికి రూ.పదివేల జరిమానా విధించారని ఆయన చెప్పారు.
