Nizamabad City | జింకను వేటాడిన కేసులో పలువురి అరెస్ట్

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | జింకను (deer) వేటాడిన కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం రూరల్​ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ (Rural SHO Srinivas) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిరోజుల కిందట మల్లారం (Mallaram) శివారులోని గుట్టల్లో జింకను హతమర్చారు. అటవీశాఖాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా బోర్గాం గ్రామానికి (Borgaon village) చెందిన ముగ్గురు […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | జింకను (deer) వేటాడిన కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గురువారం రూరల్​ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ (Rural SHO Srinivas) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిరోజుల కిందట మల్లారం (Mallaram) శివారులోని గుట్టల్లో జింకను హతమర్చారు. అటవీశాఖాధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో భాగంగా బోర్గాం గ్రామానికి (Borgaon village) చెందిన ముగ్గురు వ్యక్తులు గంధం విజయ్​, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్య, అనిల్​ నలుగురు వ్యక్తులు జింకను వేటాడినట్లు నిర్ధారించారు. పక్కా సమాచారం మేరకు గురువారం నలుగురిలో ముగ్గురు వ్యక్తులు గంధం విజయ్​, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా తాము జింకను హతమార్చినట్లు ఒప్పుకున్నారు.

నాలుగో వ్యక్తి అనిల్​ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి జింకను వేటాడేందుకు ఉపయోగించిన ఇనుప సుత్తి, ఇనుప సత్తూర్​, బరిసె, వల తదితర వస్తువులను అలాగే జింక కొమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు రిమాండ్​కు తరలించినట్లు ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ తెలిపారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...