Mopal Police | ఏడుగురు గంజాయి విక్రేతల అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal Police | ఏడుగురు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 2.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ మేరకు సౌత్​ రూరల్ సీఐ (South Rural CI) సురేశ్​ కుమార్​ శుక్రవారం వివరాలు వెల్లడించారు. మోపాల్ మండలం కంజర్​ గ్రామ శివారులో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడంతో మోపాల్​ ఎస్సై సుష్మిత వెంటనే తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. అక్కడ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal Police | ఏడుగురు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 2.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ మేరకు సౌత్​ రూరల్ సీఐ (South Rural CI) సురేశ్​ కుమార్​ శుక్రవారం వివరాలు వెల్లడించారు.

మోపాల్ మండలం కంజర్​ గ్రామ శివారులో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడంతో మోపాల్​ ఎస్సై సుష్మిత వెంటనే తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వినాయక్​ నగర్​కు చెందిన అమీర్​ ఖాన్​, నర్సింగ్​పల్లికి చెందిన షేక్​ అఫ్రోజ్​, కంజర్​కు చెందిన శివతేజలను అదుపులోకి తీసుకున్నారు.

Mopal Police | రైలులో గంజాయి రవాణా

ముగ్గురు నిందితులు నాందేడ్​కు (Nanded) రైళ్లలో వెళ్లి గంజాయి తీసుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ షేక్​ ఇమ్రాన్​, మిర్జా జుబేర్​ బేగ్​ అనే వ్యక్తుల నుంచి గంజాయిని కిలోకు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దానిని మోపాల్​ తీసుకొచ్చి 5 గ్రాముల చొప్పున విక్రయిస్తున్నారు. 5 గ్రాముల ప్యాకెట్​ను రూ.200 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. మైనర్లు, కాలేజీ విద్యార్థులకు సైతం వీరు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Mopal Police | నాందేడ్​కు వెళ్లి ఆపరేషన్​

కంజరలో దొరికిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నాందేడ్​ వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయి అమ్ముతున్న షేక్​ ఇమ్రాన్​, మిర్జా జుబేర్​ బేగ్​తో పాటు మరో ఇద్దరు నిందితులు అముల్​ చౌరే, షేక్​ షేర్​ఖాన్​లను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను కేసులో అరెస్ట్​ చేశారు. కంజర్​లో దొరికిన ముగ్గురు నిందితుల వద్ద సుమారు 1.2 కిలోల గంజాయి, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్​లో అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీఐ సురేశ్​కుమార్​, ఎస్సై సుష్మిత, సిబ్బందిని సీపీ సాయి చైతన్య అభినందించారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...