Scrub Typhus | విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. ఏపీలో ఐదుకు చేరిన మృతులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Scrub Typhus | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​లో స్క్రబ్‌ టైఫస్‌ విజృంభిస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం (Vizianagaram), పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లా (Nellore District)లకు చెందిన వారు స్క్రబ్​ టైఫస్​తో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి ప్రాణంతకమైంది. దీనిని ఇప్పటి వరకు టీకా అందుబాటులో లేదు. దీంతో ముందు జాగ్రత్తలే ఏకైక మార్గమని వైద్య […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Scrub Typhus | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​లో స్క్రబ్‌ టైఫస్‌ విజృంభిస్తుంది. దీని ప్రభావంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

విజయనగరం (Vizianagaram), పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లా (Nellore District)లకు చెందిన వారు స్క్రబ్​ టైఫస్​తో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి ప్రాణంతకమైంది. దీనిని ఇప్పటి వరకు టీకా అందుబాటులో లేదు. దీంతో ముందు జాగ్రత్తలే ఏకైక మార్గమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో గత కొన్నేళ్లుగా స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ప్రస్తుతం మరణాలు చోటు చేసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది.

ఏదైనా కీటకం కుట్టినట్లు అనిపించినా.. కాలిన గాయం లాంటి మచ్చలు లేదా దద్దుర్లు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు ఒకటి, రెండు రోజులు ఉంటే అప్రమత్తం కావాలి. ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే నయం అవుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది.

Scrub Typhus | ఇలా వ్యాపిస్తుంది.

ఓరింయెంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియాతో స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి వ్యాపిస్తుంది. నల్లిని పోలిన ‘చిగ్గర్ మైట్’ (Chigger Mite) కీటకం కాటు ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. అయితే ఇది అంటు వ్యాధి కాదు. పొలాల్లో, తోటల్లో పనిచేసే రైతులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి సోకి ఇప్పటి వరకు విజయనగరం జిల్లాకు చెందిన సీహెచ్‌ రాజేశ్వరి, పల్నాడుకు చెందిన ఎం.జ్యోతి, వై నాగమ్మ, బాపట్ల జిల్లాకు చెందిన ఎస్‌కే మస్తాన్‌బీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సంతోషి చనిపోయారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...