అక్షరటుడే, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లోని టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏపీ ఎస్సెస్సీ బోర్డు మే నెలలో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. మే 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు మే 28వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గురువారం నుంచి పరీక్షల ఫీజు చెల్లించుకోవాలని, మే 1వ తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపింది.
Tenth exams | షెడ్యూల్ ఇదే..
19న ఫస్ట్ లాంగ్వేజ్ & పేపర్-1 (కాంపోజిట్ కోర్సు), 20న సెకండ్ లాంగ్వేజ్, 21వ తేదీన ఇంగ్లిష్, 22న గణితం, 23వ తేదీన ఫిజిక్స్, 24న బయోలజీ, 26వ తారీఖున సాంఘిక శాస్త్రం, 27న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్ కోర్సు) &OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, 28వ తేదీన OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి.