అక్షరటుడే, ఇందూరు: BJYM Nizamabad | సంక్రాంతి పండుగ (Sankranthi festival ) అంటేనే పతంగుల సంబరమని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్నాటి కార్తీక్ అన్నారు. ఆదివారం 25వ డివిజన్లో చిన్నారులకు ఉచితంగా పతంగులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమే హిందూ పండుగలని (Hindu festivals) అన్నారు. రైతులందరు సంతోషంగా భోగి, సంక్రాతి, కనుమగా మూడు రోజుల పండుగను నిర్వహించుకుంటారన్నారు. చిన్న, పెద్దా అంతా కలిసి సంబరం చేసుకోవడం అనాదిగా వస్తోందన్నారు.
BJYM Nizamabad | ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు
ముఖ్యంగా పతంగులు ఎగరేసే క్రమంలో చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలు, రహదారులు, ఎత్తైన భవనాల సమీపంలో పతంగులు ఎగరేయకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రమాదాలకు దారితీసే చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. భద్రతే ప్రధాన లక్ష్యంగా పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు జగదీష్, నిరంజన్, దినేష్, రాకేష్, నాని పాల్గొన్నారు.
