ePaper
More
    HomeతెలంగాణGP Workers | పంచాయతీ కార్మికులకు శుభవార్త.. జీతాలు విడుదల

    GP Workers | పంచాయతీ కార్మికులకు శుభవార్త.. జీతాలు విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :GP Workers | రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎట్టకేలకు పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించింది. మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో జీపీ కార్మికులు(GP Workers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం ఇటీవల ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీ పర్పస్​ వర్కర్లకు(Multi Purpose Workers) వేతనాలు విడుదల చేసింది.

    రాష్ట్రంలో పని చేసే పంచాయతీ కార్మికులకు గతంలో పంచాయతీ ఖాతాల నుంచి జీతాలు చెల్లించేవారు. దీంతో జీపీలకు వచ్చే నిధులలో నుంచి కార్మికులకు జీతాలు ఇచ్చేవారు. లేదంటే సర్పంచులు సొంతంగా నెలనెలా జీతాలు ఇచ్చి తర్వాత నిధులు విడుదలైనప్పుడు తీసుకునే వారు. అయితే 16 నెలలుగా పల్లెల్లో పాలక వర్గాలు లేవు. అంతేగాకుండా ప్రభుత్వం నేరుగా జీపీ కార్మికుల ఖాతాల్లో వేతనాలు వేస్తోంది. అయితే ప్రతినెలా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

    READ ALSO  Chiranjeevi meets CM | సీఎం రేవంత్​ రెడ్డితో చిరంజీవి భేటీ.. ఇంటికి వెళ్లి మరీ మీట్​.. కారణం ఏమిటో..!

    GP Workers | రూ.150 కోట్లు విడుదల

    పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్​ కార్మికుల వేతనాల కోసం రూ.150 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు (Finance Department Orders) జారీ చేసింది. ఏప్రిల్​, మే, జూన్​ నెలలకు సంబంధించిన వేతనాల కోసం ఈ నిధులను కేటాయించింది. ఈ మేరకు నిధులు కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి నెలా తమకు జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తే.. మిగతా రోజుల్లో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    READ ALSO  CM Chandra Babu | చేనేత కార్మికుల‌కి చంద్ర‌బాబు వ‌రాలు...జీఎస్టీ మాఫీ, ఉచిత విద్యుత్, త్రిఫ్ట్ ఫండ్

    Latest articles

    Karnataka | ఈ మ‌ర్డ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని మించిందిగా.. మ‌హిళ‌ని చంపి బాడీని ముక్క‌లుగా క‌ట్ చేసి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : karnataka | తెల్లవారు జామున ఆ రోడ్డుపై వెళ్తున్నవారికి ఏదో తేడా అనిపించింది. సాధారణంగా...

    Guvvala Balaraju | కేటీఆర్​ను గ్రామాల్లో అడుగు పెట్టనివ్వను.. గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాజీ మంత్రి, బీఆర్​ఎస్​...

    Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య ముదిరిన విభేదాలు.. కేటీఆర్‌కు రాఖీ క‌ట్ట‌ని క‌విత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య రాజకీయం చిచ్చు రేపింది. కేటీఆర్‌ (KTR), క‌విత...

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​.. ఇక ఆన్​లైన్​లో స్టేటస్​ చూసుకోవచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల...

    More like this

    Karnataka | ఈ మ‌ర్డ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని మించిందిగా.. మ‌హిళ‌ని చంపి బాడీని ముక్క‌లుగా క‌ట్ చేసి..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : karnataka | తెల్లవారు జామున ఆ రోడ్డుపై వెళ్తున్నవారికి ఏదో తేడా అనిపించింది. సాధారణంగా...

    Guvvala Balaraju | కేటీఆర్​ను గ్రామాల్లో అడుగు పెట్టనివ్వను.. గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాజీ మంత్రి, బీఆర్​ఎస్​...

    Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య ముదిరిన విభేదాలు.. కేటీఆర్‌కు రాఖీ క‌ట్ట‌ని క‌విత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Political Rakhi | అన్నాచెల్లి మ‌ధ్య రాజకీయం చిచ్చు రేపింది. కేటీఆర్‌ (KTR), క‌విత...