MGNREGA | ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి: ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్

అక్షరటుడే, కామారెడ్డి: MGNREGA | ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని గురువారం సాయంత్రం జీఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. జీ రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ యుద్ధం చేస్తోందని, లోక్ సభలో […]

అక్షరటుడే, కామారెడ్డి: MGNREGA | ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని గురువారం సాయంత్రం జీఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. జీ రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ యుద్ధం చేస్తోందని, లోక్ సభలో 100 మందికి పైగా ఎంపీలు దీనిపై కొట్లాడతారని పేర్కొన్నారు.

MGNREGA | ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల అమలు

కేంద్రంలోని బీజేపీ పేద ప్రజల సంక్షేమం కోసం కాకుండా ధనవంతుల కోసం పని చేస్తుందని ఆరోపించారు. గాంధీ వాదం పేరు చెబుతూనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరాగాంధీ హయాంలో పేద ప్రజల కోసం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకాన్ని రూపు మాపేందుకు కుట్ర చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న అన్ని గ్రామాల్లో తీర్మానాలు చేస్తామని తెలిపారు.

MGNREGA | పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు

జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ సాధించిందని ఏఐసీసీ కార్యదర్శి అన్నారు. నాలుగు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసం ఉందన్నారు. అనంతరం పలువురు నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్​గా పోటీ చేసేందుకు దరఖాస్తులను సమర్పించారని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రెటరీలు చంద్రశేఖర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...