Nizamabad Rural Mla | ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన రూరల్​ ఎమ్మెల్యే

అక్షరటుడే, ఇందల్వాయి: Nizamabad Rural Mla | సిరికొండ మండలంలోని (Sirikonda mandal) తూంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి (MLA Dr. Bhupathi Reddy) శనివారం తనిఖీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే యూకేజీ పిల్లలను గ్రామస్థులు ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు నిర్ణయించారు. అయితే చిన్నారులు నేలమీద కూర్చోని చదువుకుంటున్నారు. అయితే పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు ఈ సమస్యను తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. […]

అక్షరటుడే, ఇందల్వాయి: Nizamabad Rural Mla | సిరికొండ మండలంలోని (Sirikonda mandal) తూంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి (MLA Dr. Bhupathi Reddy) శనివారం తనిఖీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే యూకేజీ పిల్లలను గ్రామస్థులు ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు నిర్ణయించారు. అయితే చిన్నారులు నేలమీద కూర్చోని చదువుకుంటున్నారు.

అయితే పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు ఈ సమస్యను తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. డీఈవో అశోక్​తో (DEO Ashok) ఫోన్​లో మాట్లాడారు. గ్రామస్థులంతా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారని.. ఇందుకు తగ్గట్టుగా విద్యార్థుల కోసం తరగతి గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్​ సిరికొండ మండలాధ్యక్షుడు బాకారం రవి, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, నాయకుడు ఎర్రన్న, నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులున్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...